logo

మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలోని మున్నూరు కాపుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్‌రావు కోరారు.

Published : 20 May 2022 02:49 IST


నూతన అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, కార్యవర్గ సభ్యులను సన్మానించిన మెదక్‌ జిల్లా ప్రతినిధులు

కాచిగూడ: రాష్ట్రంలోని మున్నూరు కాపుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్‌రావు కోరారు. మున్నూరు కాపుల సమస్యలపై తమ ప్రతినిధి బృందం త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలవనుందని తెలిపారు. గురువారం కాచిగూడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పేద మున్నూరు కాపులు, రైతులు, రైతు కూలీల పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని