Chandrababu: అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదు: చంద్రబాబు
ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ.. సైకో జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.
శ్రీకాకుళం: ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ.. సైకో జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు తెదేపా పుట్టినిల్లు అని చెప్పారు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాతినని తెలిపారు. మీ కుటుంబాలకు పెద్దకొడుకులా సేవ చేస్తానన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని వివరించారు.
‘‘ఎన్నికలకు నేటి నుంచి 19 రోజులు మాత్రమే ఉంది. మే 13న వైకాపాకు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. అసమర్థ చేతకాని ప్రభుత్వంలో అన్నీ ఇబ్బందులే. సమర్థ ప్రభుత్వం, నాయకత్వం ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయి. మేం అధికారంలోకి వచ్చాక ‘అమ్మకు వందనం’ కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తాం. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే నా లక్ష్యం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తాం.. వడ్డీ లేని రుణాలు అందిస్తాం. స్థలాలు లేని వారికి 2, 3 సెంట్లు భూమి ఇప్పించి గృహాలు నిర్మిస్తాం.
పెంచిన రూ.4 వేల పింఛన్లను ఏప్రిల్ నుంచే ఇస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు అందిస్తాం. పింఛన్ల పేరుతో ఈ ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తోంది. జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తాం. సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబ భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తుంది. అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదు. సంపద సృష్టించే, ఉద్యోగాలు కల్పించే వాళ్లు నాయకులు. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్.. ఏం చేశారని ఇక్కడికి వస్తున్నారు? ఒక్క ప్రాజెక్టయినా కట్టారా? ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చారా? ఏమీ చేయకుండా ప్రజలకు కథలు చెప్పడానికి వస్తున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాయి ధరమ్తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. జనసైనికులపై వైకాపా వర్గీయుల దాడి
జనసేనాని పవన్ కల్యాణ్కు మద్దతుగా సినీ హీరో సాయి ధరమ్ తేజ్ చేపట్టిన ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసైనికులపై వైకాపా వర్గీయులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. -
మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లు.. ఇదీ వైకాపా పాలన: పవన్ కల్యాణ్
వైకాపా పాలన మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లుగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. -
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల మెడకు ఉరితాడు: చంద్రబాబు
సూపర్ సిక్స్, మోదీ హమీలు చూసి జగన్కు నిద్రపట్టడం లేదని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై బదిలీ వేటు
ap dgp rajendranath reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
సీఎం రమేశ్పై దాడి.. జగన్ ఫ్రస్టేషన్కు ఉదాహరణ: గంటా శ్రీనివాసరావు
అనకాపల్లి లోక్సభ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడిని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. -
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం, అయోమయ పరిస్థితులు పోలింగ్ అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
మా మామ నీచుడు.. అతనికి ఓటేస్తే సమాజానికి చేటు: డాక్టర్ గౌతమ్
ఏపీ మంత్రి, సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబుకు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రమవుతుందని ఆయన రెండో అల్లుడు గౌతమ్ అన్నారు. -
రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని మోదీనే: ధర్మవరం సభలో చంద్రబాబు
దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
ఏపీలో చంద్రబాబు.. కేంద్రంలో మోదీ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి: అమిత్షా
ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే తెదేపా, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని భాజపా అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్షా అన్నారు. -
ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు
ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు వేశారు. వారిపై అందిన ఫిర్యాదులపై మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. -
పొలాల్లో నాటిన హద్దు రాళ్లే.. జగన్ ఓటమికి శిలాఫలకాలు
జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
పార్టీ మారారని పొట్ట కొట్టిన వైకాపా నాయకులు
వైకాపా నాయకుల ఆగడాలు ఆగడం లేదు. తెదేపా సభలకు వెళ్లారని, ప్రచారంలో పాల్గొన్నారని, తమ పార్టీలో చేరలేదని వైకాపా శ్రేణులు... దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. -
అంగీకారం.. అభ్యంతరం.. రెండూ ఆయనవే!
‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్ అథారిటీ (జిల్లా జడ్జి స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
ప్రతి రంగంలోనూ మార్పులు తెచ్చాం
‘ఎన్నడూ లేని విధంగా ఈ 59 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. రూ.2.70 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. -
జగన్ పాలనంతా బూతులు.. గోతులే
‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను వ్యతిరేకించాలని కోరుతున్నా. -
నరసాపురం.. కూటమిదే బలం!
సాగునీరందక పంట విరామం.. తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచిన భీమవరంలో జే ట్యాక్స్.. ఇంటికి పునాది పడితే ‘కే’ ట్యాక్స్.. ఇదీ నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో పరిస్థితి. -
జగన్ ఇంటి సమీపంలో యువతిపై అఘాయిత్యం కేసులో చర్యలేవి?
సీఎం జగన్ ఇంటి సమీపంలో యువతిపై జరిగిన అఘాయిత్యం కేసు నిందితుల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు శిక్షించలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ప్రశ్నించారు. -
మేం అధికారంలోకి వచ్చాక రౌడీలు జైల్లోకే!
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి.. జైళ్లలోనైనా ఉండాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించినవారి భరతం పట్టేందుకే ‘రెడ్ బుక్’ ఉందని హెచ్చరించారు. -
దళిత, గిరిజనులను జగన్ బిచ్చగాళ్లలా చూశారు
ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. -
మంత్రాలయం ఎమ్మెల్యేకి నిరసన సెగ
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వై.బాలనాగిరెడ్డికి చుక్కెదురైంది. -
పోస్టల్ బ్యాలెట్కు రూ.3 వేలు
తమకు ఓటేస్తే రూ.3 వేలు ఇస్తామని కొందరు ఉద్యోగులకు వైకాపా నాయకులు ఎర వేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించే కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించకూడదు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!