Chandrababu: రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం.. సంకల్పంతో ముందుకెళ్లండి: చంద్రబాబు
రాక్షసులతో యుద్ధం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
అమరావతి: రాక్షసులతో యుద్ధం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్లమెంట్, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఫామ్లు తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న ఆయన.. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలన్నదే తమ నినాదమని తేల్చి చెప్పారు. 3 పార్టీల మధ్య సమన్వయం ఉంటూనే, ఓటు బదిలీ జరగాలని దిశానిర్దేశం చేశారు. వైకాపాలో సీటు ఇస్తానన్నా తీసుకోకుండా బయటకు వచ్చిన మంచి వాళ్లను మాత్రమే తీసుకుని సీట్లు ఇచ్చానని స్పష్టం చేశారు.
పార్టీలో కొత్తగా చేరిన వారు పార్టీ లైను ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎన్నికలకు ఇక 22 రోజుల సమయమే ఉందని గుర్తు చేసిన చంద్రబాబు.. ఈ సమయం ఎంతో కీలకమన్నారు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చెప్పడంలో జగన్ నేర్పరి అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతిసారీ సానుభూతితో గెలవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రూ.43వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధరిస్తే.. దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకున్నాడని దుయ్యబట్టారు. జగన్ బస్సు యాత్రలో వాళ్లే కరెంట్ తీసుకుని, చీకట్లో తాను దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లకార్డులు పట్టుకొచ్చి నినాదాలు చేశారని విమర్శించారు. రాయి దాడి ఘటనలో బొండా ఉమ ప్రమేయం ఉందని చెప్పించేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
పింఛన్ల పంపిణీకి నిధుల్లేకుండా చేసి, వాలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతో ఆగిపోయాయని విష ప్రచారం చేశారని ఆరోపించారు. అమరావతి, పోలవరాన్ని జగన్ విధ్వంసం చేశారని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కేడర్తో ప్రతి అభ్యర్థీ అనుసంధానం కావాలని సూచించారు. అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ మారారని పొట్ట కొట్టిన వైకాపా నాయకులు
వైకాపా నాయకుల ఆగడాలు ఆగడం లేదు. తెదేపా సభలకు వెళ్లారని, ప్రచారంలో పాల్గొన్నారని, తమ పార్టీలో చేరలేదని వైకాపా శ్రేణులు... దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. -
అంగీకారం.. అభ్యంతరం.. రెండూ ఆయనవే!
‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్ అథారిటీ (జిల్లా జడ్జి స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
ప్రతి రంగంలోనూ మార్పులు తెచ్చాం
‘ఎన్నడూ లేని విధంగా ఈ 59 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. రూ.2.70 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. -
జగన్ పాలనంతా బూతులు.. గోతులే
‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను వ్యతిరేకించాలని కోరుతున్నా. -
నరసాపురం.. కూటమిదే బలం!
సాగునీరందక పంట విరామం.. తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచిన భీమవరంలో జే ట్యాక్స్.. ఇంటికి పునాది పడితే ‘కే’ ట్యాక్స్.. ఇదీ నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో పరిస్థితి. -
జగన్ ఇంటి సమీపంలో యువతిపై అఘాయిత్యం కేసులో చర్యలేవి?
సీఎం జగన్ ఇంటి సమీపంలో యువతిపై జరిగిన అఘాయిత్యం కేసు నిందితుల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు శిక్షించలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ప్రశ్నించారు. -
మేం అధికారంలోకి వచ్చాక రౌడీలు జైల్లోకే!
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి.. జైళ్లలోనైనా ఉండాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించినవారి భరతం పట్టేందుకే ‘రెడ్ బుక్’ ఉందని హెచ్చరించారు. -
దళిత, గిరిజనులను జగన్ బిచ్చగాళ్లలా చూశారు
ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. -
మంత్రాలయం ఎమ్మెల్యేకి నిరసన సెగ
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వై.బాలనాగిరెడ్డికి చుక్కెదురైంది. -
పోస్టల్ బ్యాలెట్కు రూ.3 వేలు
తమకు ఓటేస్తే రూ.3 వేలు ఇస్తామని కొందరు ఉద్యోగులకు వైకాపా నాయకులు ఎర వేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించే కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించకూడదు. -
జగన్ గెలిస్తే ప్రజల భూములన్నీ తాకట్టే!
కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ప్రజల భూముల్ని తాకట్టు పెట్టడానికి జగన్ కుట్ర పన్నినట్లు తెదేపా నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. -
సందిగ్ధతతో ఓటును చెల్లని కాగితంగా చేయొద్దు..!
పోస్టల్ బ్యాలట్ వేయడంలో కొంతమంది ఉద్యోగులు చేస్తున్న తప్పుల కారణంగా ఓట్లు చెల్లనివిగా మారుతున్నాయి. ఓటు వేయడంలో సందేహాలు ఉంటే అక్కడే ఉండే పీఓ, ఏపీఓల సహాయం సైతం తీసుకోవచ్చు. -
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలట్ విధానం అస్తవ్యస్తం
ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలట్ విధానం అస్తవ్యస్తంగా మారిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. -
పొలాల్లో నాటిన హద్దు రాళ్లే.. జగన్ ఓటమికి శిలాఫలకాలు
జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
ప్రజల ఆస్తులు లాక్కొనేందుకు జగన్ కుట్ర
భూ యాజమాన్య హక్కు చట్టం పేరిట ప్రజల ఆస్తులను లాక్కొనేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
నేడు ధర్మవరానికి అమిత్షా.. జమ్మలమడుగుకి రాజ్నాథ్సింగ్
అనంతపురం జిల్లా ధర్మవరంలోని బత్తలపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదివారం ఉదయం 10.30గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొననున్నారు. -
రేపు అనకాపల్లి జిల్లాకు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ ఎన్నికల్లో భాజపాతో తెదేపా, జనసేన కూటమిగా జట్టుకట్టిన తర్వాత తొలిసారిగా చిలకలూరిపేట బహిరంగసభకు వచ్చిన మోదీ.. తాజాగా రాజమహేంద్రవరంతో పాటు అనకాపల్లి జిల్లాలో పర్యటించేందుకు సోమవారం రానున్నారు. -
పవన్ను ఇబ్బంది పెట్టాలని హెలిప్యాడ్ ధ్వంసం
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం జీబీసీ రహదారిలో ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా నిర్మించిన హెలిప్యాడ్ను వైకాపా నాయకులు శనివారం ధ్వంసం చేశారు. -
అలా ఫిర్యాదు... ఇలా ఆదేశాలు
సీఎం జగన్ మొదలుకుని కింది స్థాయి వైకాపా నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా అసత్య ఆరోపణలతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయటంపై ఎన్ని ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం (ఈసీ).. ప్రతిపక్షాలపై వైకాపా నాయకులు చేస్తున్న ఫిర్యాదులపై మాత్రం ఆఘమేఘాలపై స్పందిస్తోంది. -
జగనన్న బ్రాండ్లు వద్దే వద్దు...‘గోవా’ నకిలీ మద్యం అంటగట్టొద్దు
‘జగనన్న బ్రాండ్ల మద్యం వద్దే వద్దు..గోవా బ్రాండ్ల పేరిట అంటగడుతున్న నకిలీ మద్యం అసలే వద్దు. ప్రచారానికి వస్తుంటే మా ప్రాణాలతో చెలగాటమాడతారా? -
ఎన్నికలయ్యేలోపు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టేసుకోండి
ఎన్నికల వేళ ఓట్లను అక్రమంగా పొందడానికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కొత్త ఎత్తు వేశారు.