సంక్షిప్త వార్తలు (7)
సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన నేత బీవీ వెంకటరాముడిని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ రాష్ట్ర మీడియా సమన్వయకర్తగా నియమించారు.
తెదేపా రాష్ట్ర మీడియా సమన్వయకర్తగా వెంకటరాముడు
ఈనాడు డిజిటల్, అమరావతి: సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన నేత బీవీ వెంకటరాముడిని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ రాష్ట్ర మీడియా సమన్వయకర్తగా నియమించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు వెంకటరాముడు మీడియా సమన్వయకర్తగా వ్యవహరించారు.
మే 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ ప్రచారం
ఈనాడు, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. మే 3, 4 తేదీల్లో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచార సభల్లో, రోడ్ షోలో పాల్గొంటారు. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు పీలేరులో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం 6.30కి విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారు. నాలుగో తేదీ మధ్యాహ్నం 3.45కు రాజమహేంద్రవరం, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో జరిగే సభల్లో మోదీ పాల్గొంటారు.
కోడ్ ఉల్లంఘించిన చెవిరెడ్డిపై చర్యలు తీసుకోండి
ఈసీకి తెదేపా నేతల ఫిర్యాదు
ఈనాడు డిజిటల్, అమరావతి : ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారుల్ని బెదిరించిన వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు ఎన్నికల అదనపు అధికారికి తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, ఏఎస్ రామకృష్ణ, అశోక్బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కోనేరు సురేశ్లు గురువారం ఫిర్యాదు చేశారు.
తెదేపాకు ముస్లిం సంఘాల మద్దతు
ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో తెదేపాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పలు ముస్లిం సంఘాలు ప్రకటించాయి. విజయవాడలోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ అధ్యక్షతన వివిధ సంఘాల ప్రతినిధులు గురువారం సమావేశం నిర్వహించారు. తెదేపా అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రమంతా పర్యటిస్తామని రాష్ట్ర ఇమానే మజ్లీస్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫరీద్ తెలిపారు. గతంలో ముస్లింలకు తెదేపా ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, మరోసారి అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే పథకాలను వివరిస్తామన్నారు. ఏపీ ముస్లిం పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ జాఫర్ మాట్లాడుతూ ముస్లింలకు ప్రత్యేక పథకాలు అమలుచేసి గుర్తింపునిచ్చింది తెదేపానే అని, ఆ పార్టీకి అండగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఏపీ ముస్లిం మైనారిటీ యువజన కమిటీ అధ్యక్షుడు షేక్ ముజీబ్ మాట్లాడుతూ ముస్లింలకు ఏ ఆపద వచ్చినా అండగా నిలబడే నేత చంద్రబాబు అని, తెదేపా అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు.
నెల్లూరు టౌన్ డీఎస్పీని బదిలీ చేయండి
సీఈఓకు వర్ల రామయ్య ఫిర్యాదు
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల్ని ఇబ్బందిపెడుతున్న నెల్లూరు టౌన్ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆయన సీఎం జగన్ ఓఎస్డీ నీలకంఠరెడ్డికి దగ్గర బంధువని, ఇలాంటి పోలీసు అధికారి ఆధ్వర్యంలో పారదర్శక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఈఓ ముకేశ్కుమార్ మీనాకు గురువారం ఫిర్యాదు చేశారు.
పింఛన్ల పంపిణీపై ఈసీకి లేఖ రాశాం: మంత్రి బొత్స
చీపురుపల్లి గ్రామీణం, న్యూస్టుడే: వచ్చే నెల ఒకటో తేదీకల్లా అందరికీ పింఛన్లు పంపిణీ అయ్యేలా చూడాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పీకే పాలవలసలో గురువారం ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.
మెగా డీఎస్సీ అని మోసం: తెదేపా నేత వల్లూరి కిరణ్
ఈనాడు డిజిటల్, అమరావతి: అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామంటూ హామీ ఇచ్చిన జగన్.. సీఎం అయ్యాక ఒక్క ఉపాధ్యాయ పోస్టునూ భర్తీ చేయలేదని తెదేపా నేత వల్లూరి కిరణ్ ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగిత రేటు.. జాతీయ స్థాయి కంటే 11 శాతం అధికంగా ఉందని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు ఓటేస్తే మీ భూములు మీవి కావు: చంద్రబాబు
వైకాపాకు ఓటేస్తే మీ భూములు మీవి కావని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. -
తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే మట్టిలో కలిసిపోతారు: పవన్ కల్యాణ్
తిరుమల పవిత్రతను కాపాడుతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. -
జాబ్ క్యాలెండర్ పేరుతో యువతకు జగన్ మోసం: నారా లోకేశ్
ఉత్తరాంధ్రను దోచుకున్న వైకాపా నేతలు కాస్త కూడా అభివృద్ధి చేయలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పెంచిన మద్యం ధరల్లో జగన్, పెద్దిరెడ్డి వాటా ఎంత?: చంద్రబాబు
పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. -
కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి: నారా రోహిత్
ఏపీ ప్రజలంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్లో తప్పిదం.. ఇద్దరు అధికారులపై చర్యలు
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్ బ్యాలెట్లో జరిగిన తప్పిదంపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. -
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై పలుచోట్ల ఉద్యోగుల ఆగ్రహం
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో పలుచోట్ల గందరగోళం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవ్: సీఈవో ముకేశ్కుమార్ మీనా
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
వివేకా హత్య.. రూ.40కోట్లు చేతులు మారినట్లు ఆధారాలు: షర్మిల
వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎంపీ అవినాష్రెడ్డి ఎందుకు మౌనం వహించారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. -
బనగానపల్లిలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ.. రాళ్లదాడిలో ఆరుగురికి గాయాలు
తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
వైకాపా మూకదాడితో విజయవాడ వాసుల బెంబేలు
విజయవాడ విశాలాంధ్రకాలనీలో ఎస్టీ ఉద్యోగి మనోజ్కుమార్పై వైకాపా మూక దాడికి సంబంధించి ఎన్నికల సంఘం స్పందించింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వేయడానికి వైకాపా ఇచ్చిన డబ్బు తీసుకోలేదని మనోజ్కుమార్పై ఆదివారం వైకాపా నాయకులు మూకుమ్మడిగా దాడిచేసిన విషయం తెలిసిందే. -
విశాఖ తీరంలో కూటమి విజయవిహారమే!
జగన్ ఐదేళ్ల పాలనలో విశాఖ సాగర తీరం ఘోషిస్తూనే ఉంది. అది అల్పపీడనంలా ప్రారంభమై, వాయుగుండమై, తుపాను నుంచి ఉప్పెనలా మారబోతోంది. అధికార వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది. ప్రశాంత తీరమైన విశాఖను విధ్వంసం చేశారన్న ఆవేదన అడుగడుగునా వినిపిస్తోంది. -
వైకాపాను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా!
‘వైకాపాకు ఓటేయొద్దంటూ ఎంత చెప్పినా అప్పట్లో మీరు వినలేదు. ఇప్పుడు ఈ పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగింది’ అంటూ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు టీవీ రామారావు చెప్పుతో కొట్టుకుని ఎస్సీల తరఫున పశ్చాత్తాపం ప్రకటించారు. -
కొడాలికి ‘కోడ్’ వర్తించదా?.. రంగా విగ్రహానికి ముసుగు తొలగించి మరీ దండలు
కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఎన్నికల ప్రచారంలో కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన.. నామినేషన్ వేసే రోజే అధికారులు అనుమతించిన మార్గంలో కాకుండా తనకు నచ్చినట్లు వైకాపా శ్రేణులను మళ్లిస్తూ వెళ్లారు. -
ప్రచార రణంలో పంచ్లు!
‘వేసవిలోనే ఫ్యాన్ను నాలుగులోనో, ఐదులోనో పెట్టుకుంటాం. గాలి బాగా వస్తుంది. కానీ, కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ను ఏకంగా ‘151’లో పెట్టారు. ఏమైంది.. ఇల్లు టాప్ లేచిపోయేలా.. జగన్ సర్కార్ విద్యుత్తు బిల్లులతో బాదేసింది. అందుకే.. ఇప్పుడు ఫ్యాన్ను 4లోనో, 5లోనో ఉంచండి’ -
పోస్టల్ బ్యాలట్ పోలింగ్పై అదే నిర్లక్ష్యం
నాలుగు రోజులుగా పోస్టల్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోంది. ప్రతి ఓటు విలువైనదేనని చెప్పే ఎన్నికల సంఘమే ఉద్యోగుల ఓట్లపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. -
ఓటర్లకు డబ్బు పంచిన కానిస్టేబుల్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పోస్టల్ బ్యాలట్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఓ కానిస్టేబుల్ను తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో వైకాపా మూకలు గొడవకు దిగి, రాళ్ల దాడికి తెగబడ్డాయి. -
‘జీతంగా.. ప్రభుత్వ సొమ్ము’ విపక్షాలపై దుమ్ము
తన ఐదేళ్ల పాలనలో.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి చేతులు రాలేదు.. ప్రైవేటులో ఉపాధి పెంచడానికీ మనసొప్పలేదు.. కానీ తనను పొగుడుతూ, ప్రతిపక్షాలను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే.. తన ‘సామాజిక’ సైనికులకు మాత్రం.. జీతాల రూపంలో సర్కారు సొమ్మును కుమ్మరించారు జగన్. -
ఓటరు సమాచార చీటీలో స్వల్ప మార్పు
గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది. ఫొటోను తొలగించి, ఆ స్థానంలో క్యూఆర్ కోడ్ పొందుపర్చింది. ప్రస్తుతం వాటిని బీఎల్వోలు ఇంటింటికీ పంచుతున్నారు. -
కత్తికట్టిన అధికార పక్షం కట్టు తప్పిన రాష్ట్రం..
తెదేపాకు మద్దతిస్తే చంపేస్తామంటున్నారు.. దాడులకు తెగబడుతున్నారు.. ఆ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే అంతు తేలుస్తామంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు వెళ్లని వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు. -
పోస్టల్ బ్యాలట్కు బదులు ఈవీఎంపై సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలట్ పేపర్లు ఇవ్వాల్సింది పోయి తహసీల్దార్ ఏకంగా ఈవీఎంను ఉపయోగించారని సీఈవో ముకేశ్కుమార్మీనాకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్