icon icon icon
icon icon icon

Chandrababu: వైకాపాకు ఓటేస్తే మీ భూములు మీవి కావు: చంద్రబాబు

వైకాపాకు ఓటేస్తే మీ భూములు మీవి కావని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 07 May 2024 22:48 IST

తిరుపతి: ‘వైకాపాకు ఓటేస్తే మీ భూములు మీవి కావు’ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో మంగళవారం రాత్రి తిరుపతిలో చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్‌ తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు ప్రజల మెడకు ఉరితాడు లాంటిదన్నారు. ప్రజల భూములపై జగన్‌ పెత్తనమేంటని నిలదీశారు. పెంచిన రూ.4వేల పింఛను ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిని పవిత్ర కేంద్రంగా నిలిపే బాధ్యత తమదని స్పష్టం చేశారు. తిరుపతిని విద్యా కేంద్రంగా చేసేందుకు కృషి చేశామని గుర్తు చేశారు.

‘‘తిరుపతిలోనే పుట్టి పెరిగాను. వేంకటేశ్వరస్వామి నాకు పునర్జన్మ ఇచ్చారు. ఇక్కడి నుంచే ఎన్టీఆర్‌, చిరంజీవి పోటీ చేశారు. తిరుపతిలో వైకాపాకు డిపాజిట్‌ కూడా రాదు. సామాజిక న్యాయానికి కూటమి కట్టుబడి ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తాం. తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ట్రస్ట్‌ బోర్డుల్లో సభ్యులుగా బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తాం. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రాష్ట్రంలో సూపర్‌ సిక్స్‌తో పాటు కేంద్రంలో మనకు మోదీ గ్యారంటీ ఉంది. మేం వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతాం. వైకాపా పాలనలో 160 ఆలయాలపై దాడి జరిగింది. అధికారంలోకి రాగానే దోషులను శిక్షిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img