పోస్టల్ బ్యాలట్ పోలింగ్పై అదే నిర్లక్ష్యం
నాలుగు రోజులుగా పోస్టల్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోంది. ప్రతి ఓటు విలువైనదేనని చెప్పే ఎన్నికల సంఘమే ఉద్యోగుల ఓట్లపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
ఎన్నికల సంఘం తీరుపై విమర్శల వెల్లువ
ఈనాడు, అమరావతి: నాలుగు రోజులుగా పోస్టల్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోంది. ప్రతి ఓటు విలువైనదేనని చెప్పే ఎన్నికల సంఘమే ఉద్యోగుల ఓట్లపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పోస్టల్ బ్యాలట్ కోసం ఫాం-12 సమర్పించినా జాబితాలో పేర్లు గల్లంతు కావడం, కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించకపోవడం, ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించడం నిత్యకృత్యంగా మారాయి. పోస్టల్ బ్యాలట్ ఉన్న వారు ఏ కేంద్రంలో ఓటు వేయాలో ముందుగా వారి సెల్ఫోన్లకు సమాచారం పంపిస్తే కొంతవరకు ఆందోళన తగ్గుతుంది. కానీ, ఎన్నికల అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదు. కర్నూలుకు చెందిన కొందరు అధికారులు శిక్షణ కోసం నంద్యాల జిల్లాకు వెళ్లారు. వీరి బ్యాలట్లను నంద్యాలకు పంపించగా.. వారు సకాలంలో ఇవ్వలేదు. దీంతో అధికారులు కర్నూలుకు రాగా.. ఇక్కడ బ్యాలట్లు లేవంటూ తిప్పి పంపారు. ఇలా చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. పోస్టల్ బ్యాలట్పై సంతకం చేస్తున్న కొందరు గెజిటెడ్ అధికారులు స్టాంప్ వేయడం లేదు. కొన్ని చోట్ల కవర్లు సక్రమంగా సీల్ చేయడం లేదు. ఇలాంటి ఓట్లు చెల్లుబాటు అవుతాయా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో పోస్టల్ బ్యాలట్ కేంద్రంలో ముగ్గురు పోలీసులకు ఆర్ఓ సీల్ వేయకుండా బ్యాలట్ పేపర్ ఇచ్చారు. ఓటు వేసిన తర్వాత తప్పిదాన్ని గుర్తించారు.
జాబితాలో కనిపించని పేర్లు..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పీఓ, ఏపీవోలకు పట్టణంలోని వై.పి.పి.ఎం. పాఠశాల ఆవరణలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ 590 మంది పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓటరు జాబితా పంపకపోవడంతో వారిలో 70 మంది ఓటు వేయలేకపోయారు. నందికొట్కూరు, ఆళ్లగడ్డ, డోన్, శ్రీశైలం నియోజకవర్గాలకు చెందిన 1,250 మందికిపైగా ఉద్యోగులకు పీఓలు, ఏపీఓలుగా డ్యూటీలు వేశారు. వీరంతా పోస్టల్ బ్యాలట్కు దరఖాస్తు చేసుకున్నా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయ్యాయి.
ఉద్యోగులకు తాయిలాలు..
- అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు కొందరు ఉద్యోగులకు రూ.3 వేలు పంపిణీ చేశారు.
- పల్నాడు జిల్లా మాచర్లలో ఒక్కో ఉద్యోగికి వైకాపా నేతలు రూ.5 వేలు ఇచ్చారు.
- పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ బంధువుతో పాటు, వైకాపా నాయకులు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వైకాపాకు ఓటేయాలని కోరుతూ రూ.2500 ఉన్న కవర్ను వారి చేతుల్లో పెట్టారు.
నరసరావుపేటలో వైకాపా నేతల దౌర్జన్యం..
పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైకాపా నేతల అరాచకాలకు హద్దు లేకుండా పోతోంది. స్థానిక పోలింగ్ కేంద్రంలోకి తెదేపా అభ్యర్థి అరవిందబాబును ఎలా అనుమతించారంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులతో గొడవకు దిగారు. ఎవరినీ లోపలకు పంపలేదని అధికారులు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా తన అనుచరులతో కలిసి అక్కడే ఉన్న తెదేపా నేతలపై దాడికి పాల్పడ్డారు. కంకులగుంటకు చెందిన తెదేపా నాయకుడి కారు ధ్వంసం చేసి డ్రైవర్ను చితకబాదారు.
బ్యాలట్ పేపర్లకు బదులు ఈవీఎం మోడల్ బ్యాలట్ల అందజేత
పోలింగ్ ముగిశాక పొరపాటు గుర్తింపు
1219 మందితో తిరిగి ఓట్లు వేయించాలని ఈసీ ఆదేశాలు
చిలకలూరిపేట గ్రామీణం, న్యూస్టుడే: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలట్లకు బదులు ఈవీఎంలో పెట్టే మోడల్ బ్యాలట్లను అందజేయగా ఉద్యోగులు వాటి మీదే ఓట్లు వేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1219 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారికి బ్యాలట్ పేపర్లకు బదులు ఈవీఎంలో పెట్టే మోడల్ బ్యాలట్ పేపర్లను ఇచ్చారు. వారు దాని మీదే ఓటు వేసి పెట్టెలో వేశారు. జరిగిన తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నివేదిక పంపించారు. స్పందించిన సీఈఓ ఆ ఓట్లను సీల్ వేసి భద్రపరచాలని ఆదేశించారు. 1219 మంది ఓటర్లతో 8, 9 తేదీల్లో మళ్లీ ఓట్లు వేయించాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ