కత్తికట్టిన అధికార పక్షం కట్టు తప్పిన రాష్ట్రం..
తెదేపాకు మద్దతిస్తే చంపేస్తామంటున్నారు.. దాడులకు తెగబడుతున్నారు.. ఆ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే అంతు తేలుస్తామంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు వెళ్లని వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు.
తెదేపా తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే అంతు తేలుస్తాం
మా అడ్డాకి వచ్చి ప్రచారం చేయటానికి ఎంత ధైర్యం రా?
ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకు బెదిరింపులు
వైకాపా సభలకు రాలేదని ప్రజల ఆస్తుల ధ్వంసం
సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఊళ్లో ఉండనివ్వబోమని హెచ్చరికలు
పోలింగ్ తేదీ దగ్గరవుతున్న కొద్దీ హింసాత్మక చర్యలు ఉద్ధృతం
ఈనాడు, అమరావతి
తెదేపాకు మద్దతిస్తే చంపేస్తామంటున్నారు.. దాడులకు తెగబడుతున్నారు.. ఆ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే అంతు తేలుస్తామంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు వెళ్లని వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు. వాళ్ల ప్రచార రథాలను తగలబెట్టేస్తున్నారు. ‘మా అడ్డాకు వచ్చి ప్రచారం చేయటానికి మీకెంత ధైర్యం రా?’ అంటూ పేట్రేగిపోతున్నారు. ఏకంగా ఇళ్లలోకి చొరబడి మరీ కర్రలు, రాడ్లతో విచక్షణ రహితంగా కొడుతున్నారు. పోలీసుస్టేషన్ల వద్దా.. ప్రతిపక్ష పార్టీల శ్రేణుల పైకి దూసుకెళ్తున్నారు. ఎన్నికల వేళ వైకాపా దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, దుశ్చర్యలు, బెదిరింపులు, ధ్వంస రచనలతో రాష్ట్రాన్ని రణరంగంగా మార్చేస్తోంది. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ వాటిని మరింతగా పెంచుతోంది. హింసాత్మక ఘటనలకు తావులేకుండా చూడాల్సిన పోలీసులు అధికార పార్టీ అరాచకాలను అణచివేయకుండా చేష్టలుడిగి చూస్తున్నారు. వైకాపాతో అంటకాగుతూ, కొమ్ముకాస్తున్నారనే ఫిర్యాదుల పైనే ఎన్నికల సంఘం పలు జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. అయినా సరే క్షేత్రస్థాయిలో వైకాపా దమనకాండ మరింతగా కొనసాగుతూనే ఉంది. అనేకచోట్ల పోలీసులే వాటికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు.
అధికార పార్టీ నాయకులు చేస్తున్న దాడులపై తప్పనిసరి పరిస్థితుల్లో తేలికపాటి సెక్షన్ల కింద మొక్కుబడిగా కేసులు కట్టి మమ అనిపించేయడం మినహా దర్యాప్తు చేయట్లేదు. ఒక్కరంటే ఒక్కర్నీ అరెస్టు చేయట్లేదు. బాధితుల పైనే రివర్స్ కేసులు పెడుతున్నారు. తీవ్ర నేర ఘటనల్లోనూ బైండోవర్లతో సరిపెట్టేస్తున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో అరాచక సామ్రాజ్యంగా మారిన పుంగనూరు, మరో చంబల్లోయలా తయారైన మాచర్ల తదితర నియోజకవర్గాల్లో అయితే అత్యంత దారుణ పరిస్థితులున్నాయి. అక్కడ ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయకుండా అధికార వైకాపా తరఫున పోలీసులే నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ఉంది. ఎక్కడ హింసాత్మక ఘటన జరిగినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తామంటూ పదేపదే చెబుతున్న ఎన్నికల సంఘం.. ఇన్ని దుశ్చర్యలు చోటుచేసుకుంటున్నా సరే బాధ్యుల్ని ఎందుకు ఉపేక్షిస్తోంది? ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కొంతమంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు అధికార పార్టీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని తీవ్రమైన హెచ్చరిక పంపించకపోవడం వల్లే ప్రతిపక్షాలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాప్తాడులో తోపుదుర్తి బ్రదర్స్ దౌర్జన్యకాండ..
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, ఆయన సోదరులు చంద్రశేఖర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, వారి అనుచరుల దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెదేపాకు మద్దతిస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైకాపాను వీడి తెదేపాలో చేరిన వారి ఇళ్ల వద్దకు అర్ధరాత్రి మందీ మార్బలాన్ని వెంటేసుకుని వెళ్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఇళ్లల్లోకి చొరబడి మరీ బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలో చేరిన వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. అయినా సరే పోలీసులు వారివైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. కనగానపల్లి మండలం వేపకుంటకు చెందిన వైకాపా నాయకుడు తలారి పుల్లప్ప అనుచరులతో కలిసి ఇటీవల తెదేపాలో చేరారు. దీంతో అర్ధరాత్రి వేళ ఆ ఊరు వెళ్లిన రాజశేఖర్రెడ్డి.. పుల్లప్పను పిలిపించి ‘వెంటనే వైకాపా కండువా వేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు పడతావు’ అని హెచ్చరించారు. తోపుదుర్తి గ్రామానికి చెందిన దళిత నాయకుడు వన్నూరప్ప, బోయ సామాజికవర్గ నాయకుడు లింగమయ్యలు ఇటీవల తెదేపాకు మద్దతు ప్రకటించినందుకు అర్ధరాత్రి వేళ వారి ఇళ్లకు వెళ్లి బెదిరించి దాడికి తెగబడ్డారు. తెదేపాలో చేరిన రామగిరి మండలం మాదాపురానికి చెందని దళిత నాయకుడు, ఎంపీటీసీ సంపత్ను అపహరించి.. అడ్డొచ్చిన వారిపై దాడి చేశారు. ఈ దాడికి ప్రకాశ్రెడ్డి చంద్రశేఖర్రెడ్డి నాయకత్వం వహించారు. ఎమ్మెల్యే సోదరులు ఇద్దరూ ఇంత దౌర్జన్యకాండకు పాల్పడుతుంటే వారిని పోలీసులు ఎందుకు ఎందుకు నియంత్రించట్లేదు?
మాచర్లలో వరుసగా దాడులు, దాష్టీకాలు
మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షాలపై దాడులు, దాష్టీకాలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఏకంగా తెదేపా కార్యాలయాలను తగలబెట్టేస్తున్నారు. తమ ప్రాంతంలో ప్రతిపక్షాలు ప్రచారం చేయటానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకే విఘాతం కలిగిస్తున్నారు. ఇతర పార్టీల ప్రచార రథాలను ధ్వంసం చేస్తున్నారు. పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాచర్లలో ఘర్షణలన్నింటికీ అసలు కుట్రదారైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సైకిల్కు ఓటేస్తే ఊళ్లో ఉండనివ్వను...
‘సైకిల్ గుర్తుకు ఓటేసిన వారెవ్వర్నీ ఊళ్లో ఉండనివ్వను’ అంటూ ఉదయగిరి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి ఓటర్లను బెదిరించారు. మూలపల్లె, శకునాలపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మరీ హెచ్చరించారు. మరి అలాంటి వారిపై ఎందుకు ఎన్నికల సంఘం, పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు?
ఊరూరా దాడులే.. దాడులు
- పార్వతీపురం వైకాపా అభ్యర్థి అలజంగి జోగారావు వాలంటీర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం తెలిసి దాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్రపై దౌర్జన్యం చేశారు. ‘ఇక్కడ నీకు తంతే దిక్కెవర్రా?’ అని బెదిరించారు.
- పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం విఠలం గ్రామం వద్ద తెదేపా ప్రచార వాహనానికి వైకాపా నాయకులు నిప్పుపెట్టారు. డ్రైవర్ సీట్లో ఉండగానే వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించటంతో ఆయన తీవ్రంగా గాయాలపాలయ్యారు. రాయదుర్గం ఐటీడీపీ ప్రతినిధి కృష్ణానాయక్ను ద్విచక్రవాహనంపై నుంచి కిందకు లాగేసి పిడిగుద్దులు కురిపించి దాడి చేశారు.
- తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్దకు నామినేషన్ వేయడానికి వచ్చిన చంద్రగిరి నియోజకవర్గ తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. తెదేపా అభ్యర్థి పులవర్తి నాని వాహనాలపై దాడికి యత్నించారు.
- అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్బాబు నామినేషన్ ర్యాలీ సందర్భంగా తెదేపా కార్యకర్త ఇంటిని తగలబెట్టేశారు. ఆస్తి నష్టం కలిగించారు.
- పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డిని ప్రశ్నించినందుకు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు సలాంపై వైకాపా శ్రేణులు దాడి చేశాయి.
- పీలేరు నియోజకవర్గం పీలేరు-కలికిరి మార్గంలో వేపులబైలు వద్ద బీవైసీపీ ప్రచార వాహనలకు వైకాపా శ్రేణులు నిప్పు పెట్టారు.
- రాయచోటి నియోజకవర్గం కల్పనాయునిచెరువులో తెదేపా అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించగా.. తెదేపా ప్రచార రథాన్ని వైకాపా శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా కార్యకర్త దిలీప్కుమార్ యాదవ్ను కర్రలతో తీవ్రంగా కొట్టారు.
తెదేపా కార్యక్రమాలకు హాజరైతే వేధింపులు
- నెల్లూరు జిల్లా పొదలకూరులో చంద్రబాబు సభకు హాజరైనందుకు.. కోడూరు పంచాయతీ వెంకటేశ్వరపాలేనికి చెందిన పామంజి శ్రీరాములపై వైకాపా శ్రేణులు హత్యాయత్నానికి తెగబడ్డాయి.
- వినుకొండ తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు నామినేషన్ సందర్భంగా ర్యాలీకి హాజరైనందుకు ఈపూరు మండలం ఇనుమెళ్లలో తెదేపా కార్యకర్తలపై వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయి.
- మాచర్ల నియోజకవర్గంలో తెదేపా నాయకుడు మాగంటి అంకారావుపై వైకాపా నాయకులు దాడి చేశారు. తెదేపా పోలింగ్ ఏజెంటుగా కూర్చొంటే నరికేస్తామని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బైండోవర్తో సరిపెట్టేశారు.
- వైకాపా అభ్యర్థి నామినేషన్ ర్యాలీకి హాజరుకాలేదని ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సీఎస్పురం మండలం నల్లమడుగుల ఎస్టీ కాలనీ వాసులకు ఇళ్లకు నీటి సరఫరా నిలిపేశారు.
- మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం ఉప్పలపాడు ఎస్టీ కాలనీలో తెదేపాకు మద్దతిస్తున్నారని తాగునీటి సరఫరా ఆపేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!