icon icon icon
icon icon icon

వైకాపాను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా!

‘వైకాపాకు ఓటేయొద్దంటూ ఎంత చెప్పినా అప్పట్లో మీరు వినలేదు. ఇప్పుడు ఈ పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగింది’ అంటూ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు టీవీ రామారావు చెప్పుతో కొట్టుకుని ఎస్సీల తరఫున పశ్చాత్తాపం ప్రకటించారు.

Updated : 07 May 2024 08:49 IST

ఎస్సీల తరఫున మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పశ్చాత్తాపం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ‘వైకాపాకు ఓటేయొద్దంటూ ఎంత చెప్పినా అప్పట్లో మీరు వినలేదు. ఇప్పుడు ఈ పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగింది’ అంటూ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు టీవీ రామారావు చెప్పుతో కొట్టుకుని ఎస్సీల తరఫున పశ్చాత్తాపం ప్రకటించారు. సోమవారం గొడారిగుంటలోని తన కార్యాలయంలో కొందరు ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆయనను కలిసి కూటమికి మద్దతు ప్రకటించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. గత అయిదేళ్ల కాలంలో ఎస్సీలకు జరిగిన అన్యాయాలను ప్రస్తావించారు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవరును హత్య చేయడం, సీతానగరంలో ఇసుకదందాను ప్రశ్నించిన వరప్రసాద్‌కు పోలీస్‌ స్టేషన్‌లోనే శిరోముండనం చేయించడం వంటి పలు ఘటనలను గుర్తుచేశారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష పడినా వైకాపా ఆయనకు టికెట్‌ ఇవ్వడం.. ఎస్సీలకు సంబంధించి 27 సంక్షేమ పథకాల రద్దు చేయడం వంటి అంశాలపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీవీ రామారావు స్పందిస్తూ.. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకున్నందుకు ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. కూటమికి ఎస్సీలు మద్దతు పలకాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img