icon icon icon
icon icon icon

Chandrababu: విజయవాడ రోడ్‌ షో సరికొత్త చరిత్ర సృష్టించింది: చంద్రబాబు

విజయవాడలో ప్రధాని మోదీ, జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో కలిసి నిర్వహించిన రోడ్‌ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 08 May 2024 22:38 IST

అమరావతి: విజయవాడలో ప్రధాని మోదీ, జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో కలిసి నిర్వహించిన రోడ్‌ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రోడ్‌ షోలో పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలకు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. భారీ ప్రజా స్పందన ఎంతో థ్రిల్‌ కలిగించిందన్నారు. మూడు పార్టీల అధినేతలకు లభించిన ప్రజాభిమానం ఎన్నికల ఫలితాలు ఆశాజనక వాతావరణానికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ 4న కొత్త ప్రభుత్వం నెలకొల్పుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: పవన్‌

విజయవాడలో ప్రధాని రోడ్‌ షో విజయవంతం కావడం పట్ల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. మోదీ తలపెట్టిన వికసిత్‌ భారత్‌ కోసం తాము నిర్విరామంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రధానితో కలిసి ఏపీలో పాల్గొన్న ఎన్నికల ప్రచారం ఎంతో విలువైందన్నారు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img