icon icon icon
icon icon icon

అధికార పార్టీ అడ్డదారులు.. వైకాపా కూపన్ల పంపిణీకి అడ్డుకట్టేది?

ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అధికార పార్టీ అనేక అడ్డదారులు తొక్కుతోంది. ఇందులో భాగంగా తాయిలాలను అందించేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేవీఉష, ఆమె భర్త శ్రీచరణ్‌రెడ్డి, సీఎం జగన్‌ చిత్రాలతోపాటు.. ఆ పార్టీ గుర్తు ఉన్న కూపన్లు, వాటి పక్కనే ఓటరు వివరాలను ముద్రించి ఓటర్లకు అందజేస్తున్నారు.

Updated : 08 May 2024 08:28 IST

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అధికార పార్టీ అనేక అడ్డదారులు తొక్కుతోంది. ఇందులో భాగంగా తాయిలాలను అందించేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేవీఉష, ఆమె భర్త శ్రీచరణ్‌రెడ్డి, సీఎం జగన్‌ చిత్రాలతోపాటు.. ఆ పార్టీ గుర్తు ఉన్న కూపన్లు, వాటి పక్కనే ఓటరు వివరాలను ముద్రించి ఓటర్లకు అందజేస్తున్నారు. ఈ కూపన్‌ పొందిన ఓటర్లు.. వాటిని తిరిగి వెనక్కి ఇస్తే రూ.3వేల నగదు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. అధికార పార్టీ ఇలా బహిరంగంగా ప్రలోభాలకు తెరలేపినా.. అధికారులు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img