డోన్లో బుగ్గన ఉక్కిరిబిక్కిరి!
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. బుగ్గనకు దీటైన అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి అని భావించిన తెదేపా అధిష్ఠానం ఆయన్ను రంగంలోకి దింపింది.
ప్రచారంలో సమస్యలపై మంత్రిని నిలదీస్తున్న ప్రజలు
దూసుకెళుతున్న తెదేపా అభ్యర్థి కోట్ల
ఈనాడు, కర్నూలు: నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. బుగ్గనకు దీటైన అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి అని భావించిన తెదేపా అధిష్ఠానం ఆయన్ను రంగంలోకి దింపింది. ఈసారి డోన్లో పాగా వేసేందుకు జయసూర్యప్రకాశ్రెడ్డి వ్యూహ, ప్రతివ్యూహాలతో దూసుకెళ్తున్నారు. వాటిని తట్టుకోలేక బుగ్గన ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఆంక్షలు తట్టుకోలేక పార్టీని వీడుతుంటే..
ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న బుగ్గనపై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన్ను కలవడానికి సొంత నియోజకవర్గ ప్రజలకే ఆంక్షలు ఎదురవటాన్ని జీర్ణించుకోలేకపోయారు. మరో ప్రత్యామ్నాయం లేక ఇప్పటివరకు ఆయన పక్షాన ఉన్న పలువురు మద్దతుదారులు.. కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి డోన్కు రావడంతో రూటు మార్చేస్తున్నారు.
ఉద్యోగాల కల్పనేదీ..?
డోన్ పేరు చెప్పగానే ఎవరికైనా నాపరాయి పరిశ్రమలు గుర్తుకువస్తాయి. ఇక్కడ వందలాది పరిశ్రమలుండగా, వేలాది మంది కార్మికులు వాటిపై ఆధారపడ్డారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఈ రంగానికి ప్రోత్సాహం కరవైంది. విద్యుత్తు బిల్లులు భారీగా పెరగడం, రాయితీలు లేకపోవడంతో నాపరాయి పరిశ్రమలు తీవ్ర నష్టాలను మూటకట్టుకున్నాయి. మరోపక్క అధికారుల తనిఖీలు, దాడులు ఎక్కువ కావడంతో యజమానులు ఆయా పరిశ్రమలను మూసేస్తుండటం వైకాపాకు ఎదురుదెబ్బే. నాపరాయి పరిశ్రమను మంత్రి బుగ్గన ఆదుకోలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. మంత్రి స్థాయిలో బుగ్గన నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలేవీ తీసుకురాలేకపోయారని, ఉద్యోగాల కల్పనకు చొరవ చూపలేదని యువత నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సిమెంట్నగర్లోని పాణ్యం సిమెంట్స్లో అత్యధికులు స్థానికేతరులే ఉన్నారని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
తాగునీటికీ కటకటే..
డోన్ మండలంలో నేటికీ పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. మంత్రి బుగ్గన కుమారుడు అర్జున్రెడ్డిని జలదుర్గం గ్రామ మహిళలు తాగునీటి సమస్యపై నిలదీసిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘అభివృద్ధి అంటే ఇదేనా?’ అంటూ వారు ప్రశ్నించడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆయా ఉదంతాలను కోట్ల వర్గీయులు తమకు అనుకూలంగా మలచుకుని ఓటర్లలో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. డోన్లో నిర్మించిన 288 టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చాలావరకు పూర్తయినా.. నేటికీ లబ్ధిదారులకు అధికారికంగా ఇవ్వలేదు. 77 చెరువులకు నీళ్లిచ్చే ఎత్తిపోతల పథకం పూర్తిచేయడంలో అంతులేని తాత్సారం చేశారు. ఫలితంగా ప్యాపిలి మండలంలో 21 చెరువులు నిండని దుస్థితి నెలకొంది.
వైకాపా నాయకులు మా పొలంపైనే కన్నేశారు
గత ఎన్నికల్లో వైకాపా గెలుపునకు కృషి చేశాం. అధికారంలోకి వచ్చాక మా పొలంపైనే కొందరు వైకాపా నాయకులు కన్నేశారు. అధికార బలంతో మా పొలాన్ని కొంత లాక్కున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నేను నడిచింది ఇంత దుర్మార్గమైన పార్టీతోనా అని బాధేసింది.
డోన్కు చెందిన ఓ వ్యక్తి ఆవేదన
పంటలన్నీ దెబ్బతిన్నాయి..
డోన్, ప్యాపిలి ప్రాంతాల్లో ఈ ఏడాది కరవు తీవ్రంగా ఉంది. పంటలన్నీ దెబ్బతిన్నాయి. మంత్రి బుగ్గన మా ప్రాంతాన్ని కరవు మండలాలుగా ప్రకటింపజేయిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూశాం. జిల్లాలో ఎన్నో మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారే కానీ డోన్, ప్యాపిలి మండలాలను మాత్రం పట్టించుకోలేదు. ఇక్కడి కరవు పాలకుల కళ్లకు కనిపించకపోవడం దారుణం. రైతులు ఆర్థికంగా చితికిపోయారు.
డోన్ మండలంలోని యు.కొత్తపల్లెకు చెందిన ఓ రైతు ఆవేదన
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!