icon icon icon
icon icon icon

కూటమికి మద్దతుగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ప్రచారం

తెదేపా, జనసేన, భాజపా కూటమికి మద్దతుగా విశ్వహిందీ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ప్రచారం చేయనున్నారు.

Updated : 08 May 2024 11:44 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా, జనసేన, భాజపా కూటమికి మద్దతుగా విశ్వహిందీ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ప్రచారం చేయనున్నారు. హిందీతో పాటు భారతీయ భాషల అభివృద్ధికి అండగా నిలుస్తానన్న ప్రధాని మోదీ భరోసా నేపథ్యంలో.. ఎన్డీయే కూటమికి విశ్వహిందీ పరిషత్తు సంపూర్ణ సహకారం అందిస్తుందని యార్లగడ్డ ప్రకటించారు. ఈ మేరకు సంస్థ జాతీయ కార్యవర్గం తీర్మానించి యార్లగడ్డను ఏపీలోని కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయమని ఆదేశించింది. గురువారం విజయవాడ పశ్చిమ, కైకలూరు, ఉండి శాసనసభతో పాటు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం అనకాపల్లిలో ఓ ప్రచార కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం ధర్మవరం, రాజంపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img