icon icon icon
icon icon icon

PM Modi: ఏపీలో కూటమిదే విజయం.. ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లే: మోదీ !

ఏపీలో కూటమి జోష్‌ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిదే విజయమని, అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లే వస్తాయని చంద్రబాబు, పవన్‌తో ఆయన చెప్పినట్లు సమాచారం.

Updated : 08 May 2024 21:51 IST

విజయవాడ: ఏపీలో కూటమి జోష్‌ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్‌ షో విజయవంతమైందన్నారు. రోడ్‌ షో ముగిసిన తర్వాత మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, తాజా పరిస్థితులపై చర్చించారు. తనకు అందిన నివేదికల మేరకు కూటమిదే అధికారమని మోదీ వారితో చెప్పినట్లు తెలుస్తోంది. ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లే వస్తాయని, జగన్‌ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి మోదీ దిల్లీ బయల్దేరి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img