జగన్, పెద్దిరెడ్డి.. ఖజానాను మింగేశారు
‘ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నారు. అక్కడి ప్రజలు ఆనందంగా ఉంటే ఆయన తట్టుకోలేరు. అదేవిధంగా రాష్ట్రంలో జిమ్(జగన్) ఉన్నారు.
వారు తిన్నదంతా కక్కించి పేదలకు పంచుతా
పుంగనూరు సభలో తెదేపా అధినేత చంద్రబాబు
పెద్దిరెడ్డి ఎయిడ్స్ కంటే ప్రమాదకరం
భాజపా నేత కిరణ్కుమార్రెడ్డి ధ్వజం
ఈనాడు, చిత్తూరు: ‘ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నారు. అక్కడి ప్రజలు ఆనందంగా ఉంటే ఆయన తట్టుకోలేరు. అదేవిధంగా రాష్ట్రంలో జిమ్(జగన్) ఉన్నారు. ఇక్కడా ఎవరూ సంతోషంగా ఉండకూడదు. ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదనేది ఆయన ఉద్దేశం. రాష్ట్ర ఖజానాలోని డబ్బంతా... జగన్, పెద్దిరెడ్డిల దగ్గరే ఉంది. వారు తిన్నదంతా జూన్ 4న తర్వాత కక్కించి పేదలకు పంచి పెడతా’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మాజీ సీఎం, రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డితో కలిసి చంద్రబాబు చిత్తూరు జిల్లా పుంగనూరు వచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరుకు ఐదేళ్లలో తొలిసారి చంద్రబాబు రావడంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.సీఎం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకొచ్చారని.. ఆ చట్టంతో మనందరి జుట్టూ జలగన్న చేతిలో ఉంటుందని చంద్రబాబు వివరించారు. రీసర్వేలో జగన్ ఇచ్చిన పాసు పుస్తకం, దానిపై ఆయన ఫొటోను చూపిస్తూ... కూటమి అధికారంలోకి రాగానే వాటన్నింటనీ తగలబెడతామని హామీ ఇచ్చారు. జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకం ప్రతిని చించేశారు.
నా గుండె రగిలిపోయింది: ‘ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ ఓటుకు వైకాపా నాయకులు రూ.5 వేల చొప్పున ఇవ్వబోతే... ఆ పాపిష్టి డబ్బు తమకొద్దని చెప్పి నేరుగా వెళ్లి ఓటు వేశారు. వైకాపాపై ఉద్యోగుల్లో ఇంత కసి ఉందని నేను ఊహించలేదు. ప్రజల్లో ఇంతకంటే ఎక్కువ కోపం ఉంది. పెద్దిరెడ్డిని పుంగనూరులో రాజకీయంగా భూస్థాపితం చేయాలి. పెద్దిరెడ్డి రూ.30 వేల కోట్ల అవినీతి చేశారు. అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి నేను గతేడాది పూతలపట్టు వస్తుంటే పుంగనూరు శివారులో దాడులు చేయించారు. 450 మందిని జైలులో పెట్టించారు. ఆ ఘటన నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఆనాడు నా గుండె రగిలిపోయింది. పెద్దిరెడ్డీ నీ కథ తేలుస్తా. మీకు నిద్రలేని రాత్రులు చూపిస్తా. నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించారో మిమ్మల్నీ అంతే క్షోభ పెడతా’ అని చంద్రబాబు హెచ్చరించారు. పుంగనూరు ప్రజల నుంచి... పాడి, మామిడి రైతుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.వేల కోట్ల కమీషన్ తీసుకున్నారని రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి ఆరోపించారు. ‘క్షణం సంతోషం కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దు’ అని ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఓ ప్రకటన వచ్చేదని.. పెద్దిరెడ్డి ఎయిడ్స్ కంటే ప్రమాదకరమని అటువంటి వ్యక్తికి ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు.
ఆలయాల కూల్చివేతపై విచారణ చేయిస్తాం: చంద్రబాబు
తిరుమల పవిత్రతను కాపాడతాం: పవన్ కల్యాణ్
ఈనాడు, తిరుపతి-ఈనాడు డిజిటల్, తిరుపతి: ‘తిరుమల పవిత్రతను దెబ్బతీసే వారిని ఎదుర్కొంటాం. వైకాపా అధికారంలోకి వచ్చాక 160పైగా ఆలయాలపై దాడులు చేశారు. అర్చకులపై దాడి చేసి కొట్టారు. ఆలయ భూములను కొట్టేశారు. వైకాపా హయాంలో ఆలయాల కూల్చివేతలపై విచారణ చేయించి, కఠిన చర్యలు తీసుకుంటాం. ఆలయాల వార్షిక ఆదాయం రూ.50 వేలపైన ఉంటే అర్చకులకు రూ.15 వేలు ఇస్తాం. అంతకంటే తక్కువ ఉంటే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అందిస్తాం. పౌరోహిత్యాన్ని కులవృత్తిగా గుర్తించి బ్రాహ్మణ కార్పొరేషన్ను మరింత బలోపేతం చేస్తాం. తితిదే మొదలుకొని అన్ని ఆలయాల్లో బ్రాహ్మణులను ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తామని స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నా’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతిలో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం, వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘తిరుపతి ఆధ్యాత్మికత, తిరుమల పవిత్రతను కాపాడుకుంటాం. అమరరాజా పరిశ్రమ విస్తరణ యూనిట్ను మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మాదే’ అని పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..