icon icon icon
icon icon icon

అతివలు అత్యున్నత స్థాయికి చేరుకోవాలి

మహిళలు అన్నిరంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నదే తెదేపా అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్యేయమని నారా బ్రాహ్మణి అన్నారు.

Published : 02 May 2024 06:11 IST

స్త్రీ శక్తి మహిళా సాధికారత సమావేశంలో నారా బ్రాహ్మణి

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: మహిళలు అన్నిరంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నదే తెదేపా అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్యేయమని నారా బ్రాహ్మణి అన్నారు. బుధవారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో స్త్రీశక్తి మహిళా సాధికారత సమావేశానికి ఆమె హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ‘మా తాత ఎన్టీఆర్‌.. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, 33 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. మహిళలు పొదుపు పాటించి తమ సొంతకాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో చంద్రబాబు దేశంలోనే మొదటిసారి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. నాన్న (బాలకృష్ణ) ప్రోత్సాహంతోనే నేను, చెల్లెలు తేజస్విని ఈ స్థాయికి ఎదిగాం. కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, ప్రతి మహిళకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు రూ.1,500 నగదు, చేనేతకు వడ్డీలేని రుణాలు వస్తాయి. మహిళలు ఆలోచించి తమకు రక్షణగా నిలిచి అభివృద్ధికి తోడ్పడే వారికే ఓటు వేయాలి’ అని కోరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి, వారి చిన్న కుమార్తె తేజస్విని, తెదేపా మహిళా నేతలు కార్యక్రమంలో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img