Nara Lokesh: ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారు.. : లోకేశ్
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
మంగళగిరి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అధికారంలోకి రాగానే వ్యవస్థలన్నింటినీ దారిలో పెడతామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలోని కొండపనేని టవర్స్ వాసులతో ఆయన సమావేశమయ్యారు. చేనేత అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని.. మంగళగిరిలో వెయ్యి ఉన్న మగ్గాలను 5 వేలకు పెంచుతామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలో చేనేత కార్మికులకు, స్వర్ణకారులకు నూతన డిజైన్లపై శిక్షణ కల్పిస్తామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తుడవని అధికారం ఎందుకు?: పవన్
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేని జగన్కు అధికారం ఎందుకని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. -
గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టులో విచారణ వాయిదా
గాజు గ్లాసు గుర్తును ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఆదేశించాలని కోరుతూ తెదేపా దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. -
ప్రజలకు భూములు జగన్ తాత, నాన్న ఇచ్చారా?: చంద్రబాబు
జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయి -
వైకాపా రంగుల పిచ్చితో రూ.2300 కోట్లు దుబారా: పవన్ కల్యాణ్
రంగుల పిచ్చిలో వైకాపా ప్రభుత్వం రూ.2,300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. -
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్మీనా తెలిపారు. -
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి తెదేపా విజ్ఞప్తి
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా కోరింది. -
నదుల అనుసంధానానికి భాజపా కట్టుబడి ఉంది: నితిన్ గడ్కరీ
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో కూటమి అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
ఐదేళ్లలో జగన్ అవినీతి రూ.8 లక్షల కోట్లు: తెదేపా నేత పట్టాభిరామ్
ఐదేళ్లలో వైఎస్ జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి చేశారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
సీఎం జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘నవ సందేహాల’ పేరుతో జగన్కు షర్మిల మరో లేఖ
‘నవ సందేహాల’ పేరుతో సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. -
వైకాపా ప్రచారంలో ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టరు ఇంజిన్
దెందులూరు వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం రాజుపేటలో అబ్బయ్య చౌదరి ప్రచార ర్యాలీ తీశారు. -
చంద్రబాబు రోడ్షోలో వైకాపా కవ్వింపు చర్యలు
తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన రోడ్షోలో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. -
ప్రచారం పేరుతో.. కొడాలి నాని డబ్బుల పంపిణీ!
ఎన్నికల ప్రచారం పేరుతో గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామాల్లో రూ.లక్షల్లో నగదు పంచుతున్నా నియమావళి అమలు కమిటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పింఛన్ల పంపిణీలో మాజీ వాలంటీర్లు.. వైకాపాకు అనుకూలంగా ఓట్ల అభ్యర్థన!
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లిలో బుధవారం మాజీ వాలంటీర్లు పింఛన్ల సొమ్మును పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. -
నీటి సమస్య మాటేంటి?.. వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డిని నిలదీసిన గ్రామస్థులు
కర్నూలు జిల్లా కౌతాళం మండలం అగసలదిన్నెలో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. -
పెద్దిరెడ్డి ప్రమేయంతో వైకాపా గూండాల దాడి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షగట్టి తన ఇంటిపై దాడికి వైకాపా గూండాలను పురికొల్పారని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన పూర్వ జడ్జి ఎస్.రామకృష్ణ ఆరోపించారు. -
7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ
ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. -
తొడకొట్టి.. జోగి తనయుడి వీరంగం
మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడి రాజకీయాలు ప్రశాంతతకు నిలయమైన కృష్ణా జిల్లా పెనమలూరును దౌర్జన్యాలు, దాడులకు కేంద్రంగా మారుస్తున్నారు. -
ఆ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులెవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించం
రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు ఏయే లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయో ఆయా లోక్సభ స్థానాలకు పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థులకుగానీ, స్వతంత్ర అభ్యర్థులకుగానీ ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించదు. -
వైకాపాలో బానిసత్వం సహించలేక జనసేనలోకి వచ్చా: అంబటి రాయుడు
వైకాపాలో బానిసత్వం సహించలేక జనసేనలోకి వచ్చినట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చెప్పారు. కృష్ణా జిల్లాలో జనసేన మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులు.. వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ల తరఫున ఎన్నికల ప్రచారం కోసం రాయుడు బుధవారం అవనిగడ్డ వచ్చారు. -
తెదేపా-జనసేన మ్యానిఫెస్టో.. జనహితమే ఎజెండా
ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని గాడిన పెట్టేలా.. అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ, సమాజంలో అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యమిస్తూ తెదేపా, జనసేన విడుదల చేసిన ఉమ్మడి మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి