Prajwal Revanna: దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో.. హాసన సెక్స్ కుంభకోణం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై అపహరణ, అత్యాచారం కేసులు నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారం బయటికొచ్చిన మొదట్లోనే ప్రజ్వల్ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లిపోయారు.
చట్ట ప్రకారం విచారణను ఎదుర్కొనేందుకు ప్రజ్వల్ను తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు సరైన చర్యలు తీసుకునేలా విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యర్థించారు. ప్రజ్వల్ దౌత్య పాస్పోర్టును రద్దు చేయాలని కోరారు. అయితే.. ఈ పాస్పోర్టును ఎవరెవరికి ఇస్తారు.. దీని ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూద్దాం.
- డిప్లొమాటిక్ పాస్పోర్టును ‘టైప్ డీ’ పాస్పోర్టు అని కూడా అంటారు.
- దీనిని దౌత్యవేత్తలు, ప్రభుత్వం తరఫున అధికారిక ప్రయాణాలు చేపట్టే ఉద్యోగులు, ప్రత్యేక వ్యక్తులకు జారీ చేస్తారు. ఇండియన్ ఫారెన్ సర్వీసు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కింద పనిచేసే ఉద్యోగులకూ దీనిని అందిస్తారు. వారి బంధువులు, కుటుంబసభ్యులు విద్య, వ్యాపారం, విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటే దీనిని పొందొచ్చు.
- సాధారణ వ్యక్తులకు అందించే పాస్పోర్టు నీలం రంగులో ఉంటే.. డిప్లొమాటిక్ పాస్పోర్టు మెరూన్ కలర్లో ఉంటుంది. దీని చెల్లుబాటు పెద్దలకు పదేళ్లు, మైనర్లకైతే ఐదేళ్లు ఉంటుంది.
- పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ.. సాధారణ పాస్పోర్ట్తో పాటు డిప్లొమోటిక్ పాస్పోర్టును కూడా పొందారు. నిబంధనల ప్రకారం.. దీనితో ఇతర దేశాల్లో పర్యటించాలన్నా, ప్రైవేట్ పర్యటనలు చేపట్టాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు పొలిటికల్ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రజ్వల్ రేవణ్ణకు రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా స్పష్టం చేసింది.
- దౌత్య కార్యకలాపాలపై ఇతర దేశాల్లో పర్యటించే వ్యక్తులకు ఇది అధికారిక గుర్తింపుపత్రంగా పనిచేస్తుంది.
- ఈ పాస్పోర్టు కలిగి ఉన్న వ్యక్తులు.. అంతర్జాతీయ చట్టాలకనుగుణంగా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, దౌత్య పరమైన రక్షణలు పొందుతారు. ఇది ఆతిథ్య దేశంలో అరెస్టులు, నిర్బంధాలు, కొన్ని చట్టపరమైన చర్యల నుంచి వారిని కాపాడుతుంది. దౌత్యపరమైన విధుల నిర్వహణకు ఆటంకం లేకుండా చూస్తుంది.
- దీని కింద మరిన్ని ప్రయోజనాలు కూడా పొందుతారు. దౌత్య పాస్పోర్టు కలిగిన వ్యక్తుల కోసం చాలా దేశాలు వీసా ప్రక్రియను వేగవంతం చేస్తాయి. వారి ప్రయాణ ఏర్పాట్లను సులభతరం చేస్తాయి.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులెట్లు, ఇతర డిప్లొమాటిక్ మిషన్లు అందించే దౌత్య మార్గాలు, సేవలను వీరు పొందుతారు.
- విమానాశ్రయాల్లో, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో వీరికి ప్రాధాన్యం లభిస్తుంది. వీరి కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి.
- పాస్పోర్టు చట్టం ప్రకారం.. సెక్షన్ 6 లోని సబ్సెక్షన్ (1) నిబంధన కింద లేదా సెక్షన్ 19లోని ఏదైనా నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ పాస్పోర్టు లేదా ట్రావెల్ డాక్యుమెంట్లను రద్దు చేయొచ్చు.
- ఇది దుర్వినియోగం అయినట్లు పాస్పోర్టు అథారిటీ భావిస్తే.. పాస్పోర్టును స్వాధీనం చేసుకోవచ్చు. లేదా రద్దు చేసే అధికారం ఉంటుంది. తప్పుడు సమాచారం అందించి దీనిని పొందినా రద్దు చేయవచ్చు. వ్యక్తుల విదేశీ ప్రయాణాలను నిషేదిస్తూ కోర్టు ఉత్తర్వులు ఉన్న సందర్భాల్లో లేదా కోర్టు సమన్లు జారీ చేసిన సమయాల్లో పాస్పోర్టు అథారిటీ ఈ పాస్పోర్టు స్వాధీనం లేదా రద్దు చేసే అధికారం ఉంటుంది.
- గత ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన వెంటనే.. ఆయన తన డిప్లొమాటిక్ పాస్పోర్టును సరెండర్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత సాధారణ పాస్పోర్టు కోసం అప్లై చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనల్ని ముక్కలు చేస్తామన్నారు.. వారే ముక్కలుగా మిగలనున్నారు!
భారత్ను ముక్కలు చేయాలని పలు ప్రాంతాల్లో వేర్పాటువాదాన్ని ఎగదోసిన పాకిస్థాన్.. నేడు ముక్కలుగా చీలిపోయేందుకు సిద్ధంగా ఉంది. -
ఇడియట్ సిండ్రోమ్.. ‘ఇంటర్నెట్ వైద్యాన్ని’ ఆశ్రయించొద్దు !
IDIOT Syndrome: ఇంటర్నెట్లో అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉండటంతో చాలామంది అనారోగ్య సమస్యల నిర్ధరణకూ దాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం తేవొచ్చు. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి?
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు