China: ఆకాశాన్ని తాకే రీతిలో అద్భుతమైన ఆలయాలు.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే!
మౌంట్ ఫ్యాన్జింగ్ (Mount Fanjing).. చైనాలోని (China) వులింగ్ పర్వత శ్రేణి ప్రాంతం. ఈ భూ ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ నిటారుగా పక్కపక్కనే ఉన్న కొండలపై రెండు ఆలయాలు (Temples) నిర్మించారు. వాటిని కలిపే విధంగా ఓ ఆర్చి బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దాని వింతలు, విశేషాలు తెలుసుకోండి.
Image : Aesthetica twitter
మౌంట్ ఫ్యాన్జింగ్ (Mount Fanjing) సహజ సిద్ధమైన రాతి శిఖరం పై భాగాన్ని ‘రెడ్ క్లౌడ్స్ గోల్డెన్ పీక్’ అని పిలుస్తారు. వీటిపై నిర్మించిన రెండు బౌద్ధ ఆలయాలకు (Temples) కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో ఈ ఆలయాలను అంత ఎత్తులో నిర్మించడం ఒక వింత అనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయాలు పునర్మించినవని మరి కొందరి వాదన. చాలా ఎత్తులో ఉండటం మూలంగా ఇక్కడ బలమైన గాలులు వీస్తుంటాయి. ప్రతికూల వాతావరణం ఉంటుంది. వాటిని తట్టుకునేలా ఈ ఆలయ నిర్మాణాలను పూర్తి చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులోని ఒక బౌద్ధ ఆలయాన్ని శాక్యమునికి అంకితం చేశారట. అది వర్తమానాన్ని సూచిస్తుంది. మరో ఆలయాన్ని మైత్రేయకు అంకితం చేశారు. భవిష్యత్తులో శాక్యముని వారసుడిగా మైత్రేయ అందరికీ జ్ఞానోదయం కలిగిస్తాడని నమ్ముతున్నారు. సముద్ర మట్టానికి 8430 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని 2018లో యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
8 వేల మెట్లు ఎక్కాలి!
స్వర్గాన్ని తలపించే ఈ బౌద్ధ ఆలయాలను చేరుకోవాలంటే సందర్శకులు సుమారు 8వేల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అంత ఓపిక లేని వారి కోసం కేబుల్ కార్లు తిరుగుతుంటాయి. మెట్ల మార్గం గుండా వెళితే తొలుత దక్షిణం వైపున ఉన్న బుద్ధుని ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత వంతెన దాటి ఉత్తరం వైపు వెళితే మైత్రేయ ఆలయం చేరుకోవచ్చు. వంతెన దాటే సమయంలో మేఘాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. మెట్లు ఎక్కుతున్న సందర్భంలోనే మింగ్ (1368-1644), క్వింగ్ (1644-1911) రాజవంశాలు వేసిన శాసనాలు కన్పిస్తాయి.
మైత్రేయుడి జ్ఞానోదయ ప్రదేశం!
ఫ్యాన్జింగ్ పర్వతం మొత్తం బౌద్ధ మతంలో పరమ పవిత్రమైంది. మైత్రేయ బుద్ధుని జ్ఞానోదయ ప్రదేశంగా దీనిని విశ్వసిస్తారు. మైత్రేయ అంటే ‘భవిష్యత్తు బుద్ధుడు’. బౌద్ధ సంప్రదాయం ప్రకారం.. ఇతరులకు జ్ఞానోదయం కలిగించేందుకు ఆయన భూమిపైకి వస్తాడట. ప్రాచీన కాలంలో ఫ్యాన్జింగ్ అనేక బౌద్ధ ఆలయాలకు నిలయంగా ఉందని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. వాటిలో చాలా వరకు 16వ శతాబ్దంలో జరిగిన దాడుల్లో ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఈ పర్వతశ్రేణి చుట్టూ 50 బౌద్ధ ఆలయాలు మాత్రమే ఉన్నాయి.
చైనాలో ఫ్యాన్జింగ్ పర్వతం ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. కేవలం చైనీయులు మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు తరలివచ్చి ఫ్యాన్జింగ్ నేషనల్ నేచర్ రిజర్వ్ అందాలను ఆస్వాదిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని చూసి తీరాల్సిందేనని ఇక్కడి సౌందర్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన పర్యాటకులు చెప్పేమాట.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!