CM Jagan: సీఎం జగన్‌కు నిరసన సెగ.. అడ్డుకున్న గోపాల మిత్రలు

సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో సీఎం జగన్‌కు నిరసన సెగ తగిలింది. జగన్‌ బస్సు బత్తలపల్లికి రాగానే గోపాల మిత్రలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

Updated : 01 Apr 2024 19:50 IST

బత్తలపల్లి: సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో సీఎం జగన్‌కు (CM Jagan) నిరసన సెగ తగిలింది. జగన్‌ బస్సు బత్తలపల్లికి రాగానే గోపాల మిత్రలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వినతిపత్రం ఇచ్చేందుకు వారు యత్నించగా.. సీఎం సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పి, మోసం చేశారని గోపాల మిత్రలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఇక చేసేదేం లేక జగన్‌ బస్సు దిగి వచ్చి.. వినతిపత్రం తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని