Black fungusపై జాగ్రత్త సుమా!
కొవిడ్-19 నుంచి కోలుకున్నవారిలో మ్యుకర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) పెరిగిపోతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతున్న
ఐసీఎంఆర్ సూచనలు
ఈనాడు, దిల్లీ: కొవిడ్-19 నుంచి కోలుకున్నవారిలో మ్యుకర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) పెరిగిపోతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. వివిధ అనారోగ్య సమస్యలతో మందులు వాడుతున్న వారిలో పర్యావరణంలో ఉన్న సూక్ష్మక్రిములతో పోరాడే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారిలో మ్యుకర్మైకోసిస్ ప్రబలడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొంది. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారిలో కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, నొప్పి తలెత్తడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి అందకపోవడం, రక్తవాంతులు, మతిస్థిమితంలో మార్పులు వంటివి తలెత్తుతాయని తెలిపింది.
ఎందువల్ల వస్తుంది ?
*మధుమేహం అదుపులో లేనప్పుడు
* స్టిరాయిడ్స్ వినియోగం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గిపోవడం
*ఐసీయూలో సుదీర్ఘకాలం ఉండటం
*ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, అవయవ మార్పిడి/ కేన్సర్ ్న వోరికొనాజోల్ థెరఫీ
ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి
*మధుమేహం ఉన్న కొవిడ్ బాధితుల్లో రోగ నిరోధక వ్యవస్థను అదుపు చేయడానికి మందులు వాడినప్పుడు ఈ దిగువ లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్గా అనుమానించాలి.
* సైనసైటిస్- ముక్కు రంధ్రాలు మూసుకుపోయినప్పుడు, ఇబ్బంది తలెత్తినప్పుడు, దవడ ఎముకలో నొప్పి తలెత్తినప్పుడు.
* మొహంలో ఒకవైపు నొప్పి, తిమ్మిరి, వాపు.
* ముక్కుపై నల్లరంగు ఏర్పడటం, పంటినొప్పి.
*కంటి నొప్పితోపాటు, చూపు మందగించడం, రెండుగా కనిపించడం. జ్వరం రావడం.
* ఛాతీలోనొప్పి, శ్వాసకోసవ్యవస్థలో తీవ్ర ఇబ్బందులు.
వ్యాధి నివారణకు
*హైపర్గ్లైసీమియాను నియంత్రణలో ఉంచుకోవాలి.
*కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ను పరిశీలిస్తూ, మధుమేహాన్ని అదుపులో ఉంచాలి.
* స్టిరాయిడ్స్, యాంటీ బయాటిక్స్ను సహేతుకంగా ఉపయోగించాలి.
*ఆక్సిజన్ థెరఫీ సమయంలో హ్యుమిడిఫైయర్స్ కోసం శుభ్రమైన నీటిని ఉపయోగించాలి.
ఎలా ఎదుర్కోవాలి
* మ్యుకర్మైకోసిస్కు సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. ్న స్టిరాయిడ్స్ తగ్గించాలి. ్న రోగ నిరోధకశక్తిని అదుపులో ఉంచే మందులను వాడటం మానేయాలి. ్న 4-6వారాలపాటు యాంటీఫంగల్ చికిత్స తీసుకోవాలి. * రేడియో ఇమేజింగ్ ద్వారా రోగిలోని స్పందన, రోగ పురోగతిని పరిశీలించాలి. ్న ఫంగల్ ఇటియాలజీని కనుగొనేందుకు కేఓహెచ్ స్టెయినింగ్, మైక్రోస్కోపీ, కల్చర్, మాల్డీటాఫ్లాంటి పరీక్షలు చేయించుకోవాలి.
జాగ్రత్తలు
* దుమ్ముతో కూడిన నిర్మాణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కు ఉపయోగించాలి.
*మట్టి, ఎరువులు ముట్టుకొనేటప్పుడు, తోట పనిలాంటివి చేసేటప్పుడు బూట్లు, ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా వేసుకోవాలి.
*వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
నిర్లక్ష్యమే భారత్ కొంపముంచింది
జెనీవా: భారత్లో ప్రజలు కరోనా వ్యాప్తి ముగిసిందని పొరపడి.. మాస్కుల ధారణ వంటి నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఫలితంగా వైరస్ ఉద్ధృతి పెరిగిందని చెప్పారు. ప్రజలు గుమిగూడేందుకు, భారీస్థాయి సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వడం మహమ్మారి వ్యాప్తిని మరింత వేగవంతం చేసిందని పేర్కొన్నారు. గత అక్టోబరులో గుర్తించిన బి.1.617 రకం ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాపిస్తోందన్నారు. టీకాతో ఏర్పడే రోగ నిరోధకత నుంచి అది తప్పించుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాపిస్తున్నకొద్దీ కొత్త రకాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయన్నారు. భారీ స్థాయిలో రూపాంతరం చెందే వైరస్ రకాలపై వ్యాక్సిన్లు పెద్దగా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అదే జరిగితే ప్రపంచం మరోసారి భారీ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డబ్ల్యూహెచ్వో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?