Heart Attack: నవరాత్రుల్లో విషాదం.. గుండెపోటుతో 10మంది మృతి!
గర్బా నృత్యం చేసిన నేపథ్యంలో గుజరాత్లో వేర్వేరు చోట్ల 10మందికి పైగా మృతిచెందడం కలకలం రేపుతోంది.
అహ్మదాబాద్ : నవరాత్రుల వేళ గుజరాత్లో (Gujarat) చోటుచేసుకుంటున్న గుండెపోటు ఘటనలు తీవ్ర విషాదం నింపుతున్నాయి. పండగ వేళ ఎంతో ఉత్సాహంగా చేసే సంప్రదాయ గర్బా నృత్యంలో పాల్గొన్నవారిలో పలువురు గుండెపోటుకు గురై అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో గుజరాత్లోని పలుచోట్ల 10 మందికి పైగా గుండెపోటుతో మృతిచెందినట్టు సమాచారం. బాధితుల్లో టీనేజర్ల నుంచి మధ్య వయసు వారూ ఉన్నారు.
గర్బా నృత్యం చేస్తూ ఖేడా జిల్లాలోని కపద్వంజ్లో 17 ఏళ్ల యువకుడు వీర్ షా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. గర్బా ఆడుతుండగా అతడి ముక్కు నుంచి రక్తం కారడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో వేరే చోట వేడుకల్లో ఉన్న అతడి తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి ఆస్పత్రికి వెళ్లగా.. యువకుడు గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, తన కుమారుడికి జరిగినట్టుగా ఇంకెవరికీ జరగకూడదన్న ఉద్దేశంతో యువకుడి తండ్రి రాయ్పాల్ షా ఆ పెను విషాదాన్ని దిగమింగుకొని ఓ విజ్ఞప్తి చేశాడు.
కొడుకును పోగొట్టుకున్నా.. ఇంకెవరికీ అలా జరగకూడదని..!
‘‘చేతులు జోడించి వేడుకొంటున్నా. దయచేసి అప్రమత్తంగా ఉండండి. విరామం తీసుకోకుండా ఎక్కువ సేపు గర్బా ఆడొద్దు. నేను నా కొడుకును పోగొట్టుకున్నాను. మరెవరికీ అలా జరగకూడదని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ ఘటనతో నిర్వాహకులు మరుసటి రోజు గర్బా ఈవెంట్ను రద్దు చేశారు. కపంద్వాజ్లోని వేర్వేరు చోట్ల కూడా నిర్వాహకులు ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
వడోదర జిల్లాలో 13 ఏళ్ల బాలుడు..
గుజరాత్లో ఇదే తరహా ఘటనలు అహ్మదాబాద్, నవ్సారి, రాజ్కోట్లలోనూ చోటుచేసుకున్నాయి. వడోదర జిల్లాలోని దభోయిలో 13 ఏళ్ల బాలుడు గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో మృతిచెందాడు. వైభవ్ సోనీ(13) అనే బాలుడు గర్బా ఆడి సైకిల్పై ఇంటికి వస్తుండగా కింద పడిపోయాడు. స్వల్ప గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత బాలుడికి ఛాతీలో నొప్పి రావడంతో మందులు వేసి నిద్రపుచ్చారు. కొన్ని గంటల తర్వాత నిద్ర లేపగా.. కళ్లు తెరవలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మరోసారి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, గర్బా నృత్యం కారణంగానే గుండె పోటు వచ్చిందా?అనే విషయాన్ని వైద్యులు ధ్రువీకరించలేదు.
మరోవైపు, నవరాత్రులు ప్రారంభమైనప్పట్నుంచి గుండె సంబంధిత సమస్యలతో 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసులకు 24గంటల్లో 500లకు పైగా కాల్స్ వచ్చినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గుండెపోటు ఘటనలు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అప్రమత్తంగా ఉండాలని గుజరాత్ ప్రభుత్వం సూచించింది. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని గర్బా ఈవెంట్ నిర్వాహకులను కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య