భారత్ బంద్ ప్రశాంతం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు గంటల పాటు బంద్ పాటించారు. ఈ బంద్కు మద్దతుగా రహదారులపై బైఠాయించిన రైతులు, వారి మద్దతుదారులు ........
రాత్రి 7గంటలకు రైతులను చర్చలకు ఆహ్వానించిన అమిత్ షా
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు గంటల పాటు బంద్ పాటించారు. ఈ బంద్కు మద్దతుగా రహదారులపై బైఠాయించిన రైతులు, వారి మద్దతుదారులు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనకు మద్దతుగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఒకరోజు నిరాహారదీక్షకు దిగగా.. సాగు చట్టాలను రద్దు చేయాలని శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ ప్రభావం కొన్ని రాష్ట్రాల్లోనే కనిపించింది. ఆయా రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ధర్నాలు, రాస్తారోకోలు, రైల్రోకోలు, ప్రదర్శనలతో నిరసనకారులు కదం తొక్కారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనబడలేదు.
‘భారత్ బంద్’ లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి
జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు
భారత్ బంద్ నేపథ్యంలో దిల్లీ సరిహద్దులో కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నిర్విరామంగా కొనసాగిన ఈ బంద్లో రైతు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాలతో పాటు పలువురు పాల్గొన్నారు. తాము పిలుపునిచ్చిన బంద్ను ప్రశాంతంగా నిర్వహించిన అందరికీ రైతు సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. మరోవైపు, దిల్లీలో పలు రహదారులపై రాకపోకలు ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నారు. మరోవైపు, రైతు సంఘాలు మాత్రం తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ బంద్ను విజయవంతం చేసి కేంద్రానికి హెచ్చరిక పంపామని, సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ చేస్తోన్న తమ డిమాండ్లు ఎంత న్యాయపరమైనవో చెప్పేందుకు నేటి భారత్ బంద్కు లభించిన మద్దతే నిదర్శనమని రైతు నేతలు పేర్కొన్నారు.
భారత్ బంద్ ముగిసినప్పటికీ తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని రైతు సంఘాల నేతలు స్పష్టంచేస్తున్నారు. కేంద్రం దిగి వచ్చి కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని పట్టుబడుతున్నారు. సవరణలతోనే సరిపెడతామంటే ఊరుకొనేది లేదని తేల్చిచెబుతున్నారు.
రాత్రి 7గంటలకు అమిత్ చర్చలకు ఆహ్వానం
మరోవైపు, గత 13 రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు, నేటి భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు రాత్రి 7గంటలకు రైతులను చర్చలకు ఆహ్వానించారు. అయితే, ఇటవల జరిగిన ఐదో విడత చర్చల్లో రైతు సంఘాల నేతలు చట్టాల్లో సవరణలకు ససేమిరా అనడంతో నిర్మాణాత్మక ప్రతిపాదనలతో మరోసారి ముందుకొస్తామని కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్ చెప్పారు. రైతులతో ఆందోళనలు విరమించడమే లక్ష్యంగా ఈ నెల 9న మరోసారి చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి అమిత్ షా చర్చలకు ఆహ్వానించడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అమిత్ షా ఆహ్వానంపై రైతు సంఘాల నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
పంజాబ్లో బంద్ సంపూర్ణం
రైతు ఆందోళనలకు కేంద్రబిందువుగా ఉన్న పంజాబ్లో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. వ్యాపార సంస్థలు, దుకాణాలు, విద్యా సంస్థలు, టోల్ప్లాజాలు మూతపడ్డాయి. ప్రజారవాణా స్తంభించింది. అమృత్సర్, మొహాలీ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులతో పాటు రైతు, కార్మిక సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా దిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టు వద్ద అఖిలభారత న్యాయవాదుల సంఘం ఆందోళన చేపట్టింది. సరోజినీ నగర్ మార్కెట్లో వర్తకులు నల్లరిబ్బన్లు ధరించి రైతులకు సంఘీభావం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?