కృష్ణపట్నంలో పారిశ్రామిక కారిడార్
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సహా కర్ణాటకలోని తుమకూరులో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే యూపీలోని గ్రేటర్ నోయిడాలో మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ అండ్ మల్టీ మోడల్......
రూ.2,139 కోట్లతో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం
దిల్లీ: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సహా కర్ణాటకలోని తుమకూరులో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే యూపీలోని గ్రేటర్ నోయిడాలో మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ అండ్ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ హబ్ ఏర్పాటుకు నిర్ణయించింది. రూ.7,725 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. వీటి వల్ల సుమారు 2.8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం వివరాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, ధర్మేంద్ర ప్రదాన్ మీడియాకు వెల్లడించారు. ఓడరేవు ఉన్న కృష్ణపట్నంలో రూ.2,139 కోట్లతో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కానుందని, దీనివల్ల సుమారు 98వేల ఉద్యోగాలు వస్తాయని జావడేకర్ తెలిపారు.
అలాగే, ఆకాశ్ క్షిపణి వ్యవస్థను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏదైనా దేశం దరఖాస్తు చేసుకుంటే సత్వర అనుమతుల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. విదేశాలకు ఎగుమతి చేయబోయే ఆకాశ్ క్షిపణి వ్యవస్థ.. ప్రస్తుతం భారత దళాలు వినియోగిస్తున్న దానికంటే భిన్నంగా ఉంటుందని రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ట్వీట్ చేశారు. పెట్రోల్లో కలిపేందుకు ఉపయోగించే ఇథనాల్ ఉత్పత్తి కోసం కొత్తగా ఏర్పాటు చేయబోయే డిస్టిలరీలకు రూ.4,573 కోట్ల వడ్డీ రాయితీని అందించేందుకు తీర్మానించినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. 2030 నాటికి సుమారు వెయ్యి కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి..
జనవరి 7వరకు బ్రిటన్కు విమానాలు బంద్
చైనాలోని ఆ గుహ.. ఇప్పుడో కృష్ణబిలం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.