తీరు మారకుంటే రాబోయేది మహమ్మారుల శకమే!
అంటువ్యాధుల్ని అరికట్టే విషయంలో ప్రపంచ దేశాల విధానాల్లో మార్పులు రాకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన మహమ్మారుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ అంతర్జాతీయ నివేదిక హెచ్చరించింది.....
తప్పించుకునేందుకు ఉన్న మార్గాలివే..
ఇంటర్నెట్ డెస్క్: అంటువ్యాధుల్ని అరికట్టే విషయంలో ప్రపంచ దేశాల విధానాల్లో మార్పులు రాకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన మహమ్మారుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ అంతర్జాతీయ నివేదిక హెచ్చరించింది. ప్రకృతి విధ్వంసానికి.. మహమ్మారుల ఆవిర్భావానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే మహమ్మారుల శకాన్ని తప్పించుకోవడానికి ఉన్న మార్గాలనూ సూచించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ‘ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టం సర్వీసెస్’(ఐపీబీఈఎస్) అత్యవసర వర్క్షాప్ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 22 మంది నిపుణుల లోతైన విశ్లేషణల అనంతరం ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచ దేశాల విధానం ‘ప్రతిచర్య నుంచి నివారణ’ దిశగా మారాలని సూచించింది.
మరో 85వేల వైరస్లు..
నివేదిక ప్రకారం.. భవిష్యత్తులో ఉద్భవించే మహమ్మారులు మరింత తరచుగా, వేగంగా వ్యాప్తి చెందుతాయి. కొవిడ్-19 కంటే ఎక్కువ మంది మరణించే ప్రమాదం ఉంది. అంటువ్యాధుల్ని అరికట్టే అంశంలో ప్రపంచ దేశాల విధానాల్లో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. 1918 నాటి గ్రేట్ ఇన్ప్లూయెంజా తర్వాత వచ్చిన మహమ్మారుల్లో కొవిడ్-19 ఆరోది. అన్ని మహమ్మారుల్లాగే కరోనా మూలమూ జంతువుల్లో తిష్ట వేసే సూక్ష్మజీవుల్లోనే ఉంది. కానీ, మానవ కార్యకలాపాల వల్లే ఇది విజృంభించింది. క్షీరదాలు, పక్షుల్లో ఇప్పటి వరకు గుర్తించని మరో 1.7 మిలియన్ల వైరస్లు ఉన్నాయి. వీటిలో కనీసం 85 వేల వైరస్లు మానవులకు సోకే సామర్థ్యం ఉంది.
ఇవే మహమ్మారుల విజృంభణకు బాటలు..
కాలం గడుస్తున్న కొద్దీ వెలుగులోకి వస్తున్న కొత్త మహమ్మారుల పుట్టుక వెనుక పెద్ద రహస్యమేమీ లేదని ఐపీబీఈఎస్ ఛైర్మన్ డాక్టర్ పీటర్ డాస్జక్ అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య విధ్వంసానికి కారణమవుతున్న మానవ తప్పిదాలే మహమ్మారుల విజృంభణకూ ఆజ్యం పోస్తున్నాయన్నారు. భూ వినియోగం, వ్యవసాయ విస్తరణ, అస్థిర వాణిజ్య విధానం, ఉత్పత్తి-వినియోగం మధ్య భారీ వ్యత్యాసం ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తోందని తెలిపారు. దీంతో వన్యప్రాణులు, పశుసంపద, వ్యాధికారకాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయన్నారు. ఇదే మహమ్మారుల విజృంభణకు బాటలు వేస్తోందన్నారు. ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న మానవ తప్పిదాలను అరికట్టడమే మహమ్మారుల శకాన్ని అంతం చేయడానికున్న ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
నియంత్రణ కంటే నివారణకు 100 రెట్లు తక్కువ వ్యయం..
అంటువ్యాధులు ప్రబలిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే అవి రాకుండా అరికట్టడమే మేలని నివేదిక గుర్తుచేసింది. వ్యాక్సిన్లు, ఔషధాల ఆవిష్కరణ కచ్చితమైన పరిష్కారం కాదని.. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పతనంతో పాటు ప్రాణనష్టం భారీ స్థాయిలో ఉంటుందని అభిప్రాయపడింది. జులై నాటికి కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8-16 ట్రిలియన్ డాలర్లు కోల్పోయిందని అంచనా వేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2021 నాలుగో త్రైమాసికం ముగిసే నాటికి ఒక్క అమెరికాలోనే 16 ట్రిలియన్ డాలర్ల నష్టానికి కారణమయ్యే అవకాశం ఉందంది. మహమ్మారులు వచ్చిన తర్వాత నియంత్రించడానికయ్యే ఖర్చు కంటే రాకుండా నివారించడానికి 100 రెట్లు తక్కువ వ్యయం అవుతుందని తెలిపింది.
నివేదిక సూచించిన విధానపరమైన పరిష్కారాలు..
* రాబోయే మహమ్మారుల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి వాటి నివారణకున్న మార్గాలను విధానకర్తలకు సూచించేలా ఓ ఇంటర్ గవర్నమెంటల్ మండలిని ఏర్పాటు చేయాలి. ముప్పు ఉన్న ప్రాంతాల్ని గుర్తించి.. విజృంభణ వల్ల తలెత్తే ప్రతికూల పరిణామాల్ని అంచనా వేయాలి.
* ప్రజలు, జంతువులు, ప్రకృతికి లబ్ధి చేకూర్చేలా దేశాల మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.
* మెరుగైన ఆరోగ్య వ్యవస్థను సాధించేందుకు డబ్ల్యూహెచ్వో రూపొందించిన ‘వన్ హెల్త్’ విధానాన్ని వ్యవస్థీకృతం చేయాలి. తద్వారా మహమ్మారులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి.
* అభివృద్ధి, భూ వినియోగ ప్రాజెక్టులలో మహమ్మారుల విజృంభణ, దాని ప్రభావాన్ని అంచనా వేసే వ్యవస్థను రూపొందించాలి. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల జీవవైవిద్యానికి ఉన్న ముప్పును ముందుగానే పసిగట్టి వాటి నివారణకు కావాల్సిన పరిష్కారాలను గుర్తించాలి.
* అంతర్జాతీయ వన్యప్రాణుల వ్యాపారం ద్వారా అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించాలి. మహమ్మారుల విజృంభణకు కారణమవుతున్న జీవులతో వ్యాపారాన్ని నివారించాలి.
* ప్రజల్లో అవగాహన పెంచి అంటువ్యాధుల నివారణ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు