వదినా..‘కిమ్ జోంగ్’ ఫైన్ కడతాడంట..!
అద్భుతాలు తెలుసుకోవాలంటే ఉత్తరకొరియా వార్తలు చదవాల్సిందే.. అంటే అక్కడేదో అభివృద్ధి జరిగి ఆకాశానికి నిచ్చెనలేస్తున్నారని కాదు.. ఒక దేశం ఏ స్థాయి బానిసత్వంలో బతుకుతోందో తెలుసుకోవడానికి. అక్కడ నియంత మరణిస్తే.. ప్రజలు బలవంతగా అయినా రెండు కన్నీటి చుక్కలు రాల్చాల్సిందే.. నియంత సంతోషం కోసం ప్లెజర్
ఉత్తరకొరియా వార్తసంస్థ డీపీఆర్కే న్యూస్ సర్వీస్ బడాయి ట్వీట్
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అద్భుతాలు తెలుసుకోవాలంటే ఉత్తరకొరియా వార్తలు చదవాల్సిందే.. అంటే అక్కడేదో అభివృద్ధి జరిగి ఆకాశానికి నిచ్చెనలేస్తున్నారని కాదు.. ఒక దేశం ఏ స్థాయి బానిసత్వంలో బతుకుతోందో తెలుసుకోవడానికి. అక్కడ నియంత మరణిస్తే.. ప్రజలు బలవంతగా అయినా రెండు కన్నీటి చుక్కలు రాల్చాల్సిందే.. నియంత సంతోషం కోసం ప్లెజర్ గ్రూప్ల పేరుతో మహిళల జీవితాలు నాశనం కావాల్సిందే. అక్కడ కిమ్ కుటుంబాన్ని కాదంటే ప్రాణాల మీద ఆశ వదులు కోవాల్సిందే. చివరికి ఎటువంటి హెయిర్స్టైల్ చేయించుకోవాలో కూడా ఓ నిబంధనల పట్టిక ఏర్పాటు చేశారు. ఇంతగా ఆ దేశాన్ని ఉక్కు పిడికిలిలో బిగించిన పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ఆ దేశ వార్తా సంస్థ ఓ సంచలన ట్వీట్ చేసింది.
‘‘దేశభక్తుడిగా కిమ్ జోంగ్ ఉన్ తన విధులను పాటిస్తారు. ఆయన అన్నిరకాల పన్నులు, ఫీజులు, అసెస్మెంట్లు, లెవీలు, జరిమానాలు చెల్లిస్తారు’’అని ట్వీటింది. కిమ్కు పన్నులు విధిస్తారా..? ఫైన్లు వేస్తారా..?ఈ ట్వీట్ చాలా అతిశయంగా అనిపించింది. ప్రజాస్వామ్యానికి పెద్దన్నలాంటి దేశాల్లోనే పాలకుడికి ఫైన్ వేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కిమ్ రాజ్యంలో ఆయనకు ఫైన్ వేయడం వంటివి ఊహిస్తేనే పరలోక యాత్రకు టికెట్ తెగుతుంది.
చిన్నపిల్లలకు ఇదో శిక్ష..
కొన్ని వారాల క్రితం ఉత్తరకొరియాలో ఒక ఆదేశం విడుదలైంది. ప్రీస్కూల్ దశలోని చిన్నపిల్లలు నిత్యం 90 నిమిషాలపాటు దేశపాలకుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి తెలుసుకోవాలన్నది దాని సారాంశం. ఈ జీవోను కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ జారీ చేశారు. ఈ నిబంధనకు ‘గ్రేట్నెస్ ఎడ్యుకేషన్’ అని పేరుకూడా పెట్టారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియాకు చెందిన డైలీ ఎన్కే అనే పత్రిక ఆగస్టు 25న పేర్కొంది. గతంలో ప్రీస్కూల్ పిల్లలకు 30 నిమిషాలు కిమ్ గురించి క్లాస్ ఉండేది. ఇప్పుడు దాన్ని మరోగంట పెంచారు.
క్షమాపణలతో ఇటీవల వార్తల్లోకి..
దక్షిణ కొరియాకు చెందిన ఫిషరీ విభాగ అధికారి పొరబాటున సరిహద్దు జలాలను అతిక్రమించి ముందుకొచ్చాడని ఉత్తరకొరియా సైనికులు చంపేశారు. ఈ ఘటనపై కిమ్ దక్షిణ కొరియాకు క్షమాపణలు తెలిపారు. ఒక్కసారిగా కిమ్ క్షమాపణలు చెప్పడం దక్షిణ కొరియాను కూడా ఆశ్చర్యపర్చింది.
ట్రంప్కు అక్టోబర్ సర్ప్రైజ్ ఉంటుందా..?
అక్టోబర్లో కిమ్-ట్రంప్ మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని దక్షిణ కొరియా వార్తసంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. దీంతోపాటు ఉత్తరకొరియా వ్యవహారాల నిపుణుడు జాన్ హెర్స్కోవిట్జ్ కూడా ఈ దశగా ప్రయత్నాలు జరగవచ్చని బ్లూమ్బెర్గ్కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఇప్పటికే ట్రంప్తో చర్చలు జరగడం..అమెరికా గత పాలకులతో పోలిస్తే ట్రంప్ శాంతి చర్చలకు మొగ్గుచూపడం వంటి అంశాలపై కిమ్ సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు ట్రంప్ గెలుపునకు అనుకూలంగా ఉండేలా చర్యలు చేపట్టి.. అమెరికాతో బేరసారాలు చేయవచ్చని భావించడం కూడా దీనికో కారణంగా నిలిచింది. ఇదే జరిగితే.. ట్రంప్ దౌత్య విజయంగా ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో భాగంగా కిమ్ సోదరి కిమ్ యోజోంగ్ వచ్చేనెల వాషింగ్టన్ పర్యటించవచ్చని జాన్ కథనంలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్