పీఎం కేర్స్: ప్రభుత్వ ఆధీనంలోనిదే! కానీ..
పీఎం కేర్స్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రైవేటు వనరుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నందున సమాచార హక్కు చట్టం కిందకు రాదని తాజాగా వెల్లడించింది.
దిల్లీ: కరోనా పరిస్థితుల నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పీఎం కేర్స్ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రస్టు ద్వారా భారీగా విరాళాలను సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్చి 27, 2020న ప్రారంభమైన ఈ నిధికి కేవలం ఐదు రోజుల్లోనే రూ.3076.62 కోట్లు వచ్చినట్లు ఈ మధ్యే విడుదల చేసిన ఆడిట్ నివేదిక వెల్లడించింది. కానీ, మార్చి 31 తర్వాత వచ్చిన విరాళాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇది అసలు ప్రభుత్వానిదా? లేక ప్రైవేటుదా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రైవేటు వనరుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నందున సమాచార హక్కు చట్టం కిందకు రాదని తాజాగా వెల్లడించినట్లు సమాచారం.
ప్రధానమంత్రి ఛైర్మన్గా ఉన్న ఈ ట్రస్టును దిల్లీ రెవెన్యూ శాఖ పేరుతో మార్చి నెలలో రిజిస్టర్ చేశారు. ఈ ప్రత్యేక నిధిని రూ.2,25,000లతో కార్పస్ ఫండ్తో మార్చి 27న ప్రారంభించారు. దీనిలో రక్షణ మంత్రి, హోంమంత్రి, ఆర్థికమంత్రులు ట్రస్టీలుగా ఉన్నారు. విరాళాల వివరాలను వెల్లడించిన క్రమంలోనూ దీన్ని ప్రభుత్వ ట్రస్ట్గా పేర్కొనలేదు. అయితే, ప్రధాన మంత్రి పిలుపుమేరకు ఈ నిధికి భారీగా విరాళాలు వచ్చాయి. కేవలం స్వదేశంలోనే కాకుండా విదేశాల నుంచి విరాళాలు ఇచ్చేందుకు పీఎం కేర్స్ వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో దాతల పేర్లు బహిర్గతం చేయకపోవడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఏర్పడ్డ పీఎం కేర్స్ ప్రభుత్వానిదా..? లేక ప్రైవేటుకు సంబంధించిందా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి(PMNRF) ఉండగా కొత్తగా దీన్ని ఎందుకు రూపొందించారని విపక్షాలు ప్రశ్నించాయి. వీటితో పాలు పలువురు ఆర్టీఐ కింద సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పటికీ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, విదేశాల నుంచి విరాళాలను సేకరిస్తున్నందున దీని పూర్తిగా ప్రభుత్వ నిధిగా పరిగణించలేమని పేర్కొంది. అందుకే ఆర్టీఐ కిందకు రాదని వెల్లడించింది. అయితే, పీఎం కేర్స్పై పలు సందర్భాల్లో విరుద్ధ ప్రకటనలు ఇవ్వడంతో మరోసారి చర్చనీయాంశమయ్యింది. ఇదిలా ఉంటే, ఈ నిధికి ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, సాయుధ దళాల విభాగాలు, ఇతర ప్రైవేటు సంస్థల నుంచి భారీ స్థాయిలో విరాళాలు అందినట్లు సమాచారం.
ఇవీ చదవండి..
రైతుల జీవితాలతో ఆడుకోవద్దు: మోదీ
వ్యవసాయ చట్టాల అమలు: ఒక్క ఏడాది చూడండి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.