IND Vs PAK: టీ20 మ్యాచ్పై వ్యాఖ్యల రగడ.. ఉపాధ్యాయిని సహా ఆరుగురి అరెస్ట్
ఇటీవల జరిగిన భారత్-పాకిస్థాన్ టి-20 క్రికెట్ మ్యాచ్లో పాక్ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ
జైపుర్/ఆగ్రా: ఇటీవల జరిగిన భారత్-పాకిస్థాన్ టి-20 క్రికెట్ మ్యాచ్లో పాక్ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ పలువురు చేసిన అభ్యంతర వ్యాఖ్యలు ప్రకంపనాలు సృష్టిస్తూనే ఉన్నాయి. జాతి వ్యతిరేక వ్యాఖ్యలుచేసిన ఆరోపణలపై దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలు సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ-కశ్మీర్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో... పాక్ విజయాన్ని స్వాగతిస్తూ వ్యాఖ్యలు చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, ఆటలో ఒక జట్టుకు మద్దతు ప్రకటించడం ఎందుకు తప్పవుతుందని ప్రశ్నిస్తూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టులను పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా పలువురు జమ్మూ-కశ్మీర్ నాయకులు ఖండించారు. ముఫ్తీది తాలిబన్ మనస్తత్వమని, పాకిస్థాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినవారికి జైలు తప్పదని జమ్మూ-కశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా విమర్శించారు.
కలెక్టరేట్ ముట్టడి, ఆందోళన..
పాకిస్థాన్ క్రికెట్ జట్టు విజయం నేపథ్యంలో వ్యాఖ్యలు చేసిన ఏడుగురిపై ఆగ్రా, బరేలి, బదౌన్, సీతాపుర్లో మొత్తం 5 కేసులు నమోదైనట్టు ఉత్తర్ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకూ ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. వీరిలో ఆగ్రాలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ముగ్గురు కశ్మీర్ విద్యార్థులు కూడా ఉన్నారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యల క్రమంలో... రాజా బల్వంత్సింగ్ మేనేజ్మెంట్, టెక్నికల్ క్యాంపస్ యాజమాన్యం ఇప్పటికే వీరిని సస్పెండ్ చేసింది. ఈ ముగ్గురిపై ఐపీసీ 153ఎ (వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం), 515(1)(బి) (ఉద్దేశపూర్వకంగా ప్రజలను భయపెట్టడం), ఐటీ చట్టంలోని 66ఎఫ్ నిబంధన కింద పోలీసులు ఆరోపణలు నమోదు చేశారు! అయితే, కొన్ని సంఘాల నేతలు బుధవారం స్థానిక కలెక్టరేట్ను ముట్టడించి, సదరు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై కళాశాల డైరెక్టర్ డా.పంకజ్ గుప్తా మాట్లాడుతూ- ‘‘అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేశాం. అయినా, కొందరు కళాశాలకు మచ్చతెచ్చే ఉద్దేశంతో దురుద్దేశంతో ఆందోళన చేస్తున్నారు. కనీసం యాజమాన్యంతో సంప్రదించకుండానే మంగళవారం కళాశాలలోకి, వసతి గృహాల్లోకి చొచ్చుకువచ్చారు. ఇది ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. వారిపై చర్యలు తీసుకునేవరకూ విద్యా సంస్థలను మూసి ఉంచుతాం’’ అని ఆయన పేర్కొన్నారు.
అందరిలాగే భారత్పై నాకూ ప్రేమ ఉంది..
పాకిస్థాన్ క్రికెట్ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ వాట్సప్లో అభ్యంతరకర స్టాటస్ పెట్టిన ప్రైవేటు ఉపాధ్యాయిని నఫీసాను రాజస్థాన్లోని ఉదయ్పుర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ నఫీసా వీడియో విడుదల చేశారు. ‘‘వాట్సప్లో నాకు ఎవరో సందేశం పంపి పాకిస్థాన్కు మద్దతు పలుకుతావా? అని ఎమోజీలతో కూడిన ప్రశ్నను సరదాగా అడిగారు. దానికి నేను ‘అవును’ అంటూ అంతే సరదాగా బదులిచ్చాను. దానర్థం నేను పాకిస్థాన్కు నిజంగానే మద్దతు పలుకుతున్నట్టు కాదు’’ అని ఆమె పేర్కొన్నారు. నఫీసాను ఆమె పనిచేస్తున్న నీరజా మోదీ పాఠశాల యాజమాన్యం ఇప్పటికే తొలగించింది.
శ్రీనగర్లో పోలీసుల అదుపులో మరో ఇద్దరు..
శ్రీనగర్లో వైద్యవిద్య అభ్యసిస్తున్న పలువురు విద్యార్థులపై ‘ఉపా’ చట్టం కింద జమ్మూ-కశ్మీర్లోని సాంబా జిల్లా పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఇందులో తాజాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకూ పోలీసులు అరెస్టు చేసినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
హరియాణాలో నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. -
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
భారత్ ప్రపంచవ్యాప్తంగా స్నేహపూర్వకమైన దేశంగా మాత్రమే కాకుండా శక్తిమంతమైన దేశంగాను పేరు పొందుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. -
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి