కొవిడ్ మూలాలు: గబ్బిలాల కోసం అన్వేషణ!
కరోనా వైరస్ మూలాలను కనిపెట్టేందుకు అక్కడి గబ్బిలాల కోసం అవి నివసించే స్థావరాలపై థాయిలాండ్ శాస్త్రవేత్తలు గాలింపు చేపట్టారు.
రంగంలోకి దిగిన థాయిలాండ్ శాస్త్రవేత్తలు
థాయిలాండ్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎక్కడినుంచి వచ్చిందనే విషయంపై ఇప్పటికీ సందిగ్థత నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన నిపుణులు బృందం ఇప్పటికే చైనాలో ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసింది. తాజాగా దీనిపై థాయిలాండ్లోనూ పరిశోధనలు చేపట్టారు. కరోనా వైరస్ మూలాలను కనిపెట్టేందుకు అక్కడి గబ్బిలాల కోసం అవి నివసించే స్థావరాలపై గాలింపు చేపట్టారు. చైనా బయట తొలిసారిగా థాయిలాండ్లోనే కరోనా వైరస్ బయటపడడంతో ఈ గబ్బిలాలపై జరుపుతున్న పరిశోధనలపై ఆసక్తి నెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా 2కోట్ల మందిలో బయటపడ్డ కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే 7లక్షల 50వేల మందిని బలితీసుకుంది. ఇంతటి మహమ్మారి ముఖ్యంగా గబ్బిలాల నుంచే వ్యక్తులకు సోకిందనే అభిప్రాయం ఆదిలోనే వ్యక్తమైంది. దక్షిణ చైనాలోని యున్నాన్లో గబ్బిలాల్లో బయటపడిన వైరస్కు కరోనా వైరస్ పోలికలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. తాజాగా థాయిలాండ్ కూడా గబ్బిలాల్లో పరిశోధన మొదలుపెట్టింది. ఇప్పటికే వీరిదగ్గర దాదాపు 19జాతులకు చెందిన గబ్బిలాలు ఉన్నప్పటికీ, వీటిపై ఇప్పటివరకు కరోనా పరిశోధన పరీక్షలు చేయలేదని సమాచారం. ప్రస్తుతం వైరస్ మూలాలను కనుగొనే ప్రయత్నాలు ముమ్మరం చేసిన థాయిలాండ్ శాస్త్రవేత్తలు మరో 200లకు పైగా గబ్బిలాలను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీటికోసం సాయ్ యాక్ జాతీయ పార్కులో ఉన్న గుహల్లో అన్వేషణ మొదలుపెట్టారు. అక్కడ వీటిని పట్టుకునేందుకు థాయిలాండ్ రెడ్క్రాస్కు చెందిన ఆరోగ్య కేంద్రం నిపుణులు ప్రత్యేక గూళ్లను ఏర్పాటు చేశారు.
గబ్బిలాలు, వాటినుంచి సంక్రమించే వ్యాధులపై గత 20సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతున్న సుపాపార్న్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్నారు. ఆ గుహల్లో ఉండే వివిధ జాతుల గబ్బిలాల నుంచి రక్తం, లాలాజలంతోపాటు అవి విడుదల చేసే వ్యర్థాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. తద్వారా వీటిలో ఉండే వ్యాధికారక వైరస్ల గురించి మరింత పరిశోధనలను చేసేందుకు వీలుంటుందని సుపాపార్న్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కొవిడ్-19కు కారణమైన వైరస్కూడా ఈ గబ్బిలాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు ఆమె అభిప్రాయపడుతున్నారు. ‘ఈ మహమ్మారికి సరిహద్దులు లేవు. ఈ వైరస్ గబ్బిలాల నుంచి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రదేశానికైనా ఇవి వెళ్లగలవు’ అని పరిశోధకురాలు సుపాపార్న్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్