ఇప్పుడు చూడండి ఏమైందో..!
అసలు శ్వేతసౌధంలో కొవిడ్-19 కేసులను ముందే నివారించవచ్చని అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి వ్యాఖ్యానించారు. ఓ పక్క ట్రంప్ ఆసుపత్రి నుంచి వేగంగా శ్వేతసౌధానికి చేరుకోవడం.. అక్కడ మాస్క్ తీసి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వంటి విషయాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న
ట్రంప్ను ఇరుకున పెట్టిన ఫౌచి
ఇంటర్నెట్డెస్క్: అసలు శ్వేతసౌధంలో కొవిడ్-19 కేసులను ముందే నివారించవచ్చని అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి వ్యాఖ్యానించారు. ఓ పక్క ట్రంప్ ఆసుపత్రి నుంచి వేగంగా శ్వేతసౌధానికి చేరుకోవడం.. అక్కడ మాస్క్ తీసి ఫొటోలకు పోజులు ఇవ్వడం వంటి విషయాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఫౌచి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటికే శ్వేత సౌధంలో ట్రంప్తో సహా మెలానియా, ఇతర సిబ్బంది కూడా కొవిడ్ బారిన పడ్డారు. పలువురు రిపబ్లికన్ పార్టీ సభ్యులకు కూడా ఇది సోకింది.
అమెరికన్ యూనివర్శిటీస్ కెన్నడీ పొలిటికల్ యూనియన్ ఇంటర్వ్యూలో ఫౌచి మాట్లాడారు. ‘కరోనా మహమ్మారి అభూత కల్పన అని నమ్మే మొండివారితో నివారణ చర్యల గురించి ఎలా చర్చించాలి’ అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దానికి ఫౌచి స్పందిస్తూ..‘‘ఈ వారం వైట్హౌస్ను చూడండి. అక్కడ జరుగుతున్నది వాస్తవం. ప్రతి రోజూ మరింత మంది కొవిడ్ బారిన పడుతుంటారు. ఇది అభూత కల్పన కాదు. ఇది దురదృష్టకర పరిస్థితి. అసలు ఇది చోటు చేసుకోకుండా ముందే నివారించవచ్చు’’అని అన్నారు.
ముందే వారించినా..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డీసీజెస్ డైరెక్టర్గా ఫౌచీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ట్రంప్ కార్యవర్గంతో కలిసి పనిచేశారు. మాస్క్లు ధరిస్తే వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవచ్చని మొదటి నుంచి చెబుతూవచ్చారు. ట్రంప్ మాత్రం ఫౌచీ సూచనలను ఏమాత్రం పట్టించుకోలేదు. అత్యంత అరుదుగానే ఫేస్మాస్క్ను ధరించేవారు. కొవిడ్ సోకి అసుపత్రిలో చికిత్స పొంది శ్వేత సౌధానికి వచ్చాక కూడా ట్రంప్ ఎక్కవసేపు మాస్కు ధరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
-
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం