కెనడా ఉత్తర్వు.. సీసీఐలో గూగుల్పై DNPA పోరాటానికి చేయూత
ఆన్లైన్ వార్తల మార్కెట్లో సెర్జింజన్ దిగ్గజం గూగుల్ గుత్తాధిపత్యం, దుర్వినియోగంతో తాము భారీగా నష్టపోతున్నామంటూ భారత్లోని పలు ప్రఖ్యాత......
దిల్లీ: ఆన్లైన్ వార్తల మార్కెట్లో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ గుత్తాధిపత్యం, దుర్వినియోగంతో భారీగా నష్టపోతున్నామంటూ భారత్లోని పలు ప్రఖ్యాత వార్తా సంస్థల ఫిర్యాదులపై భారత కాంపిటేషన్ కమిషన్ (సీసీఐ) విచారణకు ఆదేశించిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డిఎన్పిఎ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూగుల్ గుత్తాధిపత్య దోపిడీపై సీసీఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కెనడాలో వచ్చిన ఉత్తర్వులు మన దేశంలోని మీడియా సంస్థల పోరాటానికి గొప్ప ప్రోత్సాహాన్నిచ్చేదిగా ఉంది. దేశంలో డీఎన్పీఏలో భాగంగా ఉన్న ప్రముఖ వార్తా పత్రికలు, డిజిటల్ ఎడిషన్లు గూగుల్ తమకు చెల్లింపుల విషయంలో అన్యాయం చేయడంపై కొన్నాళ్లుగా రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. వార్తా పత్రికలు, డిజిటల్ ఎడిషన్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న కంటెంట్పై గూగుల్ సంస్థ భారీ మొత్తంలో ప్రకటనల ద్వారా ఆదాయాలను అర్జిస్తోంది. అయితే, వార్తాల ప్రచురణకర్తలకు న్యాయమైన చెల్లింపులు చేయడంలో, ఆదాయం పంపిణీలో మాత్రం పక్షపాతంతో వ్యవహరిస్తోంది. దీంతో భారత్లోని వార్తల ప్రచురణకర్తలకు భారీగా నష్టపోతున్నారు. దీంతో అనేక ప్రజాస్వామిక దేశాల్లోని ప్రచురణకర్తలు, ప్రభుత్వం గూగుల్ చేస్తోన్న ఈ దోపిడీపై పోరాడుతున్నాయి. తమ కంటెంట్పై గూగుల్ ఆర్జిస్తున్న ఆదాయంలో తమ వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో వచ్చిన తాజా ఉత్తర్వులు భారత్ సహా ఇతర ప్రపంచ దేశాల్లో గూగుల్ గుత్తాధిపత్యానికి వ్యతిరేక పోరాటాలకు మరింత బలాన్నిచ్చేవిగా ఉన్నాయి.
కెనడాలో డిజిటల్ న్యూస్ మార్కెట్లో గూగుల్ వంటి మధ్యవర్తుల్ని నియంత్రించే ఉద్దేశంతో ఆన్లైన్ న్యూస్ యాక్ట్ను రూపొందించారు. వార్తా సంస్థలతో బేరసారాల్లో అసమానతలు లేకుండా ఉండేలా రూల్స్ తీసుకొచ్చారు. మార్కెట్లో గూగుల్ వంటి న్యూస్ అగ్రిగేటర్స్ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారా లేదా అనే నిర్దిష్ట అంశాలపై ఆధారపడి ఇది ఉంటుంది. అలాగే, మధ్యవర్తి ద్వారా అందుబాటులోకి తెచ్చిన వార్తల కోసం వార్తా వ్యాపారాలకు న్యాయమైన పరిహారం అందించే నిబంధనలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత నిబంధన ఫేస్బుక్, గూగుల్ వంటి ఫ్లాట్ఫాంలు వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు వార్తా ప్రచురణ కర్తలకు వారి కంటెంట్కు న్యాయంగా చెల్లించేందుకు వీలుగా రూపొందించారు. కెనడాలోని ఆన్లైన్ న్యూస్ యాక్ట్ ప్రకారం.. డిజిటల్ వేదికలు వార్తా ప్రచురణకర్తలతో న్యాయమైన ఒప్పందం కుదుర్చుకోవడంలో అసమానతలు ఉంటే రెగ్యులేటర్ ద్వారా పరిశీలిస్తారు లేదా మదింపు వేస్తారు. ఒకవేళ అప్పటికీ ఒప్పందాలు కార్యరూపం దాల్చకపోతే ఈ ప్లాట్ఫారమ్లు కెనడియన్ రేడియో-టెలివిజన్, టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ పర్యవేక్షించే ఆర్బిట్రేషన్ ప్రక్రియకు వెళ్లాల్సి ఉంటుంది.
గతేడాది ఆస్ట్రేలియా కూడా ఇలాంటి సంచలన చట్టాన్ని ఆమోదించిన విషయం గమనార్హం. అక్కడ కూడా గూగుల్, ఫేస్బుక్ సంస్థలు తమ వేదికల్లోని కంటెంట్ కోసం వాస్తవ వార్తా ప్రచురణకర్తలకు న్యాయమైన మొత్తాన్ని చెల్లించడాన్ని ఈ చట్టంలో తప్పనిసరి చేసింది. భారత్లో కూడా డీఎన్పీఏ కింద ఏర్పాటైన పలు మీడియా సంస్థలు ఇదే తరహా పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. డీఎన్పీఏ దాఖలు చేసిన ఫిర్యాదుపై సీసీఐ గూగుల్కు నోటీసులు జారీ చేసిన సమయంలో ఈ కెనడాలో ఈ ఆదేశాలు రావడం విశేషం. కెనడాలో వచ్చిన ఈ ఆదేశాలు.. మీడియా సంస్థలతో గూగుల్ నిష్పాక్షికంగా వ్యవహరించేలా.. నకిలీ వార్తలు, స్వాభావిక పక్షపాతం ద్వారా దేశాలకు నెగెటివ్గా ప్రచారం చేసేలా గ్లోబల్ సెర్చింజన్లు మార్చగలిగే పరిస్థితులున్న ప్రస్తుత కాలంలో మన మీడియా వృద్ధికి, వాస్తవిక వార్తల ప్రసారాన్ని పెంపొందించేందుకు చట్టాలు రూపొందించేందుకు భారత న్యాయ నిర్ణేతలను, సీసీఐని ప్రోత్సహించేదిగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని వార్తా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్పీఏ) దాఖలు చేసిన ఫిర్యాదుపై డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్లో ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలపై గూగుల్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఇప్పటికే ఆదేశించింది. డీఎన్పీఏ సభ్యులుగా జాగరణ్ న్యూ మీడియా (దైనిక్ జాగరణ్ గ్రూప్) అమర్ ఉజాలా, దైనిక్ భాస్కర్, ఇండియా టుడే, హిందుస్థాన్ టైమ్స్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈనాడు, మలయాళ మనోరమా, ఏబీపీ నెట్ వర్క్, జీ మీడియా, మాతృభూమి, హిందూ, ఎన్డీటీవీ, లోక్మత్, ఎక్స్ప్రెస్ నెట్ వర్క్ తదితర సంస్థలు ఉన్నాయి. జనవరి 7న సీసీఐ ఈ అంశంపై విచారణకు సీసీఐ డీజీతో దర్యాప్తునకు ఆదేశించింది. 60 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే, విచారణకు అర్హమైన చట్టంలోని 4(2)(ఎ)లోని నిబంధనల్ని గూగుల్ ఉల్లంఘించిందని కమిషన్ ప్రాథమికంగా అభిప్రాయపడింది. విచారణ సమయంలో మీడియా సంస్థల ఆరోపణల్ని కూడా డీజీ తగిన విధంగా పరిశీలించవచ్చని సీసీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2002లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్ ఎల్ఎల్సీ, గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్పై కంపిటిషన్ చట్టంలోని సెక్షన్ 19(1)(ఎ)కింద డీఎన్పీఏ ఫిర్యాదు చేసింది. గూగుల్ గుత్తాధిపత్యంతో వ్యవహరిస్తూ తమకు న్యాయంగా రావాల్సిన వాటాను చెల్లించకపోవడం కాంపిటిషన్ చట్టంలోని సెక్షన్ 4ని ఉల్లంఘిస్తోందని డీఎన్పీఏ ఆరోపించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?