ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఈ వైరస్తో కాల్ రికార్డ్స్, కాంటాక్టులు హ్యాక్!
Daam virus: ఆండ్రాయిడ్ (Android) ఫోన్లలో Daam పేరుతో ఉన్న ఓ వైరస్ వ్యాపిస్తోందని.. కాల్ రికార్డులను తస్కరించడంతోపాటు కాంటాక్ట్స్, హిస్టరీ, కెమెరాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇది హ్యాక్ చేస్తుందని జాతీయ సైబర్ సెక్యూరిటీ విభాగం (CERT-In) సూచించింది.
దిల్లీ: ఆండ్రాయిడ్ (Android) ఫోన్లను ఓ కొత్త వైరస్ కలవరపెడుతోంది. దామ్ (Daam Virus) పేరుతో ఉన్న ఈ వైరస్.. ఆండ్రాయిడ్ ఫోన్లలోని కాల్ రికార్డులను తస్కరిస్తున్నట్లు వెల్లడైంది. వీటితోపాటు కాంటాక్ట్స్, హిస్టరీ, కెమెరాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇది హ్యాక్ చేస్తుందని జాతీయ సైబర్ సెక్యూరిటీ (Cyber Security) విభాగం CERT-In వెల్లడించింది. యాంటీవైరస్కు చిక్కకపోవడంతోపాటు లక్షిత ఫోన్లలో వైరస్ను చొప్పించే సామర్థ్యం ఈ వైరస్కు ఉందని పేర్కొంటూ ఆండ్రాయిడ్ యూజర్లకు తాజా అడ్వైజరీ జారీ చేసింది.
‘థర్డ్పార్టీ వెబ్సైట్లు లేదా ఇతర విశ్వసనీయతలేని సైట్ల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఒకసారి ఇది ఫోన్లోకి వచ్చిన తర్వాత సెక్యూరిటీ విభాగాలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అనంతరం సున్నితమైన డేటాను తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. హిస్టరీ, బుక్మార్కులను చదవడం.. బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ను కిల్ చేయడంతోపాటు కాల్లాగ్స్ను రీడ్ చేయడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా ఫోన్ కాల్ రికార్డింగ్స్, కాంటాక్టులను హ్యాక్ చేయడం, కెమెరా యాక్సెస్ పొందడం, డివైజ్ పాస్వర్డులను మార్చడం, స్క్రీన్షాట్స్ను తీయడం, ఎస్సెమ్మెస్లను తస్కరించడం, ఫైల్స్ డౌన్లోడింగ్/అప్లోడింగ్ చేయడంతోపాటు వీటిని బాధిత ఫోన్ నుంచి సర్వర్కు చేరవేసే సామర్థ్యం ఈ వైరస్కు ఉంది’ అని CERT-In పేర్కొంది.
ఇటువంటి వైరస్లు, మాల్వేర్ల బారినపడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని CERT-In సూచించింది. విశ్వసనీయత లేని వెబ్సైట్లును బ్రౌజ్ చేయొద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని సూచించింది. అప్డేటెడ్ యాంటీవైరస్, యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్లను వినియోగించాలని పేర్కొంది. సాధారణ మొబైల్ నంబర్లు కాకుండా అనుమానాస్పదంగా కనిపించే నంబర్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపింది. బ్యాంకుల పేరుతో వచ్చే ఎస్సెమ్మెస్లు సరైనవేనా కాదా అనే విషయాన్ని జాగ్రత్తగా చూసి స్పందించాలని, షార్ట్ యూఆర్ఎల్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని CERT-In సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ను వీడిన అనంతరం రాధికా ఖేడా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. -
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
ఝార్ఖండ్లో భారీ మొత్తంలో వెలుగుచూసిన నగదుపై ప్రధాని మోదీ (Modi) స్పందించారు. -
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
తల్లిదండ్రుల తోడు లేకపోయినా.. చదువుతో పాటు తన సోదరి బాధ్యతను మోస్తూ ముందుకెళ్తున్న పదేళ్ల కుర్రాడిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. -
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడిది హరియాణాలోని కర్నాల్ ప్రాంతం. -
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
ఉగ్ర దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన భారత వైమానిక దళ(IAF) సైనికుడు కార్పోరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారాలోని అతడి స్వగ్రామానికి చేరుకుంది. -
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
అతడు రూ. 15 వేల జీతగాడు. కానీ, అతడి ఇంటిని తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా బిత్తరపోయింది. ఓ గదిలో గుట్టలుగా పేర్చిన నగదు చూసి షాకైంది. -
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
గుంతల రహదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిష్కారం కనుక్కోనుంది. నిర్మాణంలో కొత్త మెటీరియలను వినియోగించే అంశంపై పనిచేస్తోంది. -
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
నేడు గుజరాత్లోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్