హ్యాకింగ్ కలకలానికి ముందే యాపిల్ యూజర్లకు కేంద్రం అలర్ట్!
దేశవ్యాప్తంగా యాపిల్ ఫోన్ల హ్యాకింగ్పై చర్చ నడుస్తోంది. అయితే, దీనికి ముందే యాపిల్ యూజర్లను కేంద్రం అలర్ట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: తమ యాపిల్ (Apple) ఫోన్లు హ్యాక్ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు యత్నించారంటూ విపక్షనేతలు ఆరోపించడం కలకలం రేపింది. మహువా మొయిత్రా, ప్రియాంక చతుర్వేది, శశిథరూర్, రాఘవ్ చడ్డా వంటి నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం... సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. అయితే, ఈ ఘటనకు ముందే యాపిల్ యూజర్లకు కేంద్రం అలర్ట్ జారీ చేయడం గమనార్హం. యాపిల్ ఉత్పత్తుల్లో భద్రతా పరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించి ఓ హెచ్చరిక జారీ చేసింది.
ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం (CERT) యాపిల్ యూజర్లకు ఇటీవల ఓ అడ్వైజరీని జారీ చేసింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్బుక్ ఆపరేటింగ్ సిస్టమ్లతో పాటు సఫారీ బ్రౌజర్లోనూ సెక్యూరిటీ లోపాలు గుర్తించినట్లు సెర్ట్ పేర్కొంది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.1 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సోనోమా వెర్షన్ 14.1 కంటే ముందు వెర్షన్లు, వెంట్యురా వెర్షన్ 13.6.1, మానిటరీ వెర్షన్స్ 12.7.1 కంటే ముందు వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు తెలిపింది. యాపిల్కు చెందిన ఇంటర్నెట్ బ్రౌజర్ సఫారీ 17.1 కంటే ముందు వెర్షన్లలో లోపాలు గుర్తించినట్లు సెర్ట్ పేర్కొంది.
నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ సమాచారం
ఆయా ఉత్పత్తుల్లో బహుళ లోపాలు ఉన్నట్లు సెర్ట్ గుర్తించింది. దీంతో హ్యాకర్లు డివైజులను కంట్రోల్లోకి తీసుకుని సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అక్టోబర్ 27న సెర్ట్ అడ్వైజరీని జారీ చేసింది. అంతకుముందూ ఇదే తరహా అలర్ట్ జారీ చేసింది. వెంటనే లేటెస్ట్ ఐఓఎస్, మ్యాక్ ఓఎస్, టీవీ ఓఎస్, వాచ్ ఓఎస్తో పాటు సఫారీ బ్రౌజర్ను కూడా అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది. ఈ హెచ్చరిక వెలువడిన రోజుల వ్యవధిలోనే ప్రతిపక్ష ఎంపీలకు వార్నింగ్ సందేశాలు రావడం గమనార్హం. మరోవైపు హ్యాకింగ్ వ్యవహారంపై యాపిల్ సంస్థను పార్లమెంటరీ ప్యానెల్ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.