Ayodhya: ఆహ్వానం అందలేదు..! అయోధ్య ఉద్యమంలో ‘శివసేన’ది సుదీర్ఘ పోరాటం: ఉద్ధవ్ ఠాక్రే
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు ఇంకా ఆహ్వానం అందలేదని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
ముంబయి: అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram temple Consecration) ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మహత్తర కార్యక్రమంలో భాగం కావాల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. దేశవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అయితే, తనకు ఇంకా ఆహ్వానం అందలేదని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వెల్లడించారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడు కాబట్టి, తనకు ఆహ్వానం అవసరం లేదని వ్యాఖ్యానించారు. తనకు శ్రీరాముని దర్శనం కావాలని అనిపిస్తే అయోధ్యను సందర్శిస్తానని మీడియాతో చెప్పారు.
రామజన్మభూమి ఉద్యమం కోసం ‘శివసేన’ సుదీర్ఘ పోరాటం చేసిందని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. 1990ల్లో ఎన్నికల సమయంలో రామ మందిరం, హిందుత్వ కోసం ప్రచారం చేసినందుకు తన తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఓటుహక్కుపై ఈసీ నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘రామమందిర ప్రారంభోత్సవం ఓ రాజకీయ కార్యక్రమంలా మారకూడదు. ఎందుకంటే.. రాముడు ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు. ఇది కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం. సుప్రీం కోర్టు నిర్ణయమే రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఇందులో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు’ అని భాజపాను ఉద్దేశించి విమర్శలు ఎక్కుపెట్టారు.
జనవరి 22 కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది: ప్రధాని మోదీ
తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అయోధ్యను సందర్శించినట్లు ఠాక్రే గుర్తుచేసుకున్నారు. మరోవైపు.. బాబ్రీ మసీదు ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో బాల్ ఠాక్రే సహా 109 మంది శివసైనికులు ఉన్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఇదిలా ఉండగా.. జనవరి 22న నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు సహా ప్రముఖులకు కేంద్రం ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా 6 వేల మందికిపైగా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!