Maratha Quota: అలాంటి రాజకీయాలు ఎన్నడూ చేయలేదు : శరద్ పవార్
ఓబీసీ వర్గానికి (OBC category) చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఓ సర్టిఫికేట్ వైరల్ కావడంపై స్పందించిన శరద్ పవార్.. ఇలాంటి అంశాలపై తాను ఎన్నడూ రాజకీయాలు చేయలేదన్నారు.
బారామతి: తన సామాజికవర్గం పేరును దాచుకునే ఉద్దేశం తనకు లేదని.. దాని పేరు చెప్పి ఎన్నడూ రాజకీయాలు చేయలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు. పవార్ ఓబీసీ వర్గానికి (OBC category) చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఓ సర్టిఫికేట్ వైరల్ అయిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. అంతకుముందే ఇదే విషయంపై ఎన్సీపీ ఎంపీ, పవార్ కుమార్తె సుప్రియా సూలే (Supriya Sule) కూడా స్పందించారు. అదో తప్పుడు ధ్రువపత్రం అని పేర్కొన్న ఆమె.. అలాంటివి వైరల్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
‘నా సామాజికవర్గం ఏంటో ప్రపంచం మొత్తం తెలుసు. దాని ఆధారంగా నేను రాజకీయాలు చేయలేదు. అటువంటివి భవిష్యత్తులోనూ చేయను. కానీ, ఆ వర్గం సమస్యల పరిష్కారానికి అన్నివిధాలా కృషి చేస్తాను’ అని శరద్ పవార్ పేర్కొన్నారు. ఓబీసీ వర్గం అంటే ఎంతో గౌరవం ఉందని.. తాను పుట్టిన కులాన్ని దాచుకునేందుకు ఇష్టపడనని అన్నారు. మరాఠా కోటా (Maratha quota) గురించి మాట్లాడిన పవార్.. రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఉందన్నారు. మరాఠా కోటాపై యువతరంలో సెంటిమెంట్ చాలా తీవ్రంగా ఉందన్న ఆయన.. దానిని విస్మరించలేమన్నారు. అయితే, ఈ నిర్ణయాధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందన్నారు.
‘మరాఠా కోటా’ ఇచ్చేందుకు మా ప్రభుత్వం సుముఖంగా ఉంది: మహారాష్ట్ర సీఎం
ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని మరాఠాలు డిమాండు చేస్తున్నారు. ఈ అంశంపై మహారాష్ట్రలో కొంతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం.. మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుకూలమేనని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే ప్రకటించారు. అయితే, చట్టపరంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం కావాలని, అంతవరకు మరాఠా సామాజికవర్గం నేతలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.