ముగిసిన పర్యటన.. అమెరికా బయల్దేరిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన విందు అనంతరం ట్రంప్‌,

Updated : 26 Feb 2020 01:38 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన విందు అనంతరం ట్రంప్‌, మెలనియా దంపతులు నేరుగా విమానాశ్రయానికి బయల్దేరారు. అనంతరం అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు అపూర్వస్వాగతం లభించింది. విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్రంప్‌నకు పరిచయం చేశారు. భారత్‌లో తన రెండు రోజుల పర్యటన మధురానుభూతిని కలిగించిందని ట్రంప్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని