ట్రంప్ కత్తిరించొద్దు: ప్రపంచ దేశాల ఆవేదన
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధులు నిలిపివేశారు. అమెరికా ప్రజల క్షేమాన్ని కోరని ఆ సంస్థకు అమెరికన్లు చెల్లించిన పన్నుల్లోంచి ఒక్క డాలరూ విడుదల చేయనని తెగేసి చెప్పారు. సరైన సమయంలో కచ్చితత్వంతో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు....
నిందించి ప్రయోజనం లేదు
అమెరికా ప్రయోజనాలకే నష్టం
ఆరోగ్య సంస్థ ఇప్పుడే అత్యవసరం అంటున్న దేశాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధులు నిలిపివేశారు. అమెరికా ప్రజల క్షేమాన్ని కోరని ఆ సంస్థకు అమెరికన్లు చెల్లించిన పన్నుల్లోంచి ఒక్క డాలరూ విడుదల చేయనని తెగేసి చెప్పారు. సరైన సమయంలో కచ్చితత్వంతో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను ‘చైనా వైరస్’ అని పదేపదే ఆరోపించారు. ఆయన నిర్ణయంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా అవాక్కయ్యాయి. వైరస్కు సరిహద్దులు లేవన్నాయి. ఐకమత్యంతో ఉండాల్సిన తరుణంలో ఇలా చేయడం సరికాదని చైనా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలన్నీ అనడం గమనార్హం.
ట్రంప్ కోపం అందరికీ చేటు: చైనా
ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అన్ని దేశాల్లో ఆరోగ్య సంక్షోభాలను నివారించడంలో డబ్ల్యూహెచ్వో కృషిని తక్కువ చేయలేం. డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ ప్రపంచ దేశాలను సమన్వయం చేస్తూ మెరుగ్గా స్పందిస్తున్నారు. నిధులు నిలిపివేస్తే అమెరికా సహా వ్యవస్థలు సరిగ్గా లేని దేశాలపై దీని ప్రభావం ఉంటుంది. ప్రపంచ మహమ్మారులకు వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న డబ్ల్యూహెచ్ఓకు చైనా ఎప్పటికీ అండగా ఉంటుంది. ట్రంప్ కోపంగా ఉన్నారు. ఇది అమెరికన్ల ప్రయోజనాలనూ దెబ్బతీస్తుంది.
నిందిస్తే ప్రయోజనం లేదు: జర్మనీ
ఇతరుల్ని నిందిస్తే ప్రయోజనం లేదు. వైరస్కు ఎలాంటి సరిహద్దులు ఉండవు. ఐక్యరాజ్య సమితిని పటిష్ఠంగా మార్చడమే అత్యుత్తమ పెట్టుబడి. పరీక్షలు చేయడం, వ్యాక్సిన్లును అభివృద్ధి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు తగినన్ని నిధులు లేవు. కొవిడ్-19పై అందరం సమష్టిగా పోరాడాలి. ఎలాంటి వివాదాలూ లేవు. నిజానికి అమెరికాలోనూ ఆలస్యంగానే చర్యలు తీసుకున్నారు.
ఐక్యత ముఖ్యం: ఐరోపా కూటమి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదు. సంస్థకు నిధులు అత్యవసరం. ఇప్పుడు విభజన వైపు కాకుండా ఐక్యత కోసం కష్టపడాలి. ట్రంప్ నిర్ణయం పట్ల 27 దేశాల ఐరోపా కూటమి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందరూ ఏకతాటిపైకి వస్తేనే పోరులో విజయం సాధించగలం. సంక్షోభం నుంచి గట్టెక్కగలం.
చైనా, డబ్ల్యూహెచ్వోపై సానుభూతి: ఆస్ట్రేలియా
ట్రంప్ విమర్శలు చేసిన చైనా, డబ్ల్యూహెచ్వోపై సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు అందిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ అన్నారు. ‘వైరస్కు సరిహద్దులు తెలియవు. కొవిడ్పై సమష్టిగా పోరాడాలి. నిధులు లేని డబ్ల్యూహెచ్వోను పటిష్ఠం చేయాలి. ఇతర దేశాల్లో మహమ్మారులు ప్రబలకుండా చూసేది ఇదే సంస్థ. మునుపటి కన్నా నిధుల అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉంది’ అని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ గ్లోబల్ ప్లబిక్ హెల్త్ ఛైర్పర్సన్ దేవీ శ్రీధర్ అన్నారు.
తీవ్ర విచారకరం: ఆఫ్రికా కూటమి
ప్రపంచ ఆరోగ్య సంస్థకు ట్రంప్ నిధులు నిలిపివేయడం తీవ్ర విచారకరం. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ఈ రోజు ప్రపంచమంతా డబ్ల్యూహెచ్వో నాయకత్వంపై ఆధారపడింది. మనందరి సమష్టి సహకారం ఇప్పుడా సంస్థకు అవసరం.
డబ్ల్యూహెచ్వో ఇప్పుడే అత్యవసరం: బిల్ గేట్స్
నిధులు నిలిపేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం తప్పు. ప్రపంచం మొత్తం ఆరోగ్య సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఆ నిర్ణయం అత్యంత ప్రమాదకరం. డబ్ల్యూహెచ్వో చర్యల వల్లే కొవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. ఒకవేళ ఆ సంస్థ తన పనిని ఆపేస్తే మరే సంస్థా ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడే ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్వో అవసరం.
చైనాలోని వుహాన్లో కరోనా వైరస్ పురుడు పోసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షలకు పైగా కొవిడ్-19 బారిన పడ్డారు. లక్ష మందికి పైగా మృతి చెందారు. ఇక డబ్ల్యూహెచ్వోకు నిధులు అందించే అతిపెద్ద దాత అమెరికాయే. ఏటా 400-500 మిలియన్ డాలర్లు అందిస్తుంది. చైనా ఏడాదికి 40 మిలియన్ డాలర్లే ఇవ్వడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?