ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్‌ 

ప్రముఖ నటి, కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గ ఎంపీ సుమలత అంబరీష్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ఆమే స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. గత శనివారం గొంతునొప్పి, తలబాధతో బాధపడ్డానని, కరోనా వ్యాధి లక్షణాలుగా అనుమానించి పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలిందని ప్రకటనలో వెల్లడించారు. ...

Published : 06 Jul 2020 21:24 IST

బెంగళూరు: సీనియర్‌ నటి, కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గ ఎంపీ సుమలత అంబరీష్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ఆమె స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. గత శనివారం గొంతు నొప్పి, తలనొప్పితో బాధపడ్డానని ఆమె చెప్పారు. కరోనా వ్యాధి లక్షణాలుగా అనుమానించి పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలిందని సుమలత తెలిపారు. అయితే వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. తనకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉందని, వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరలోనే కోలుకుంటానని సుమలత ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తనతో కలసి పని చేసిన వారి వివరాలను అధికారులకు తెలిపానని, వారికి కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తారని ఆమె అన్నారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారికెవరికైనా వ్యాధి లక్షణాలు కన్పిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. సుమలత తొలిసారిగా మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె చివరిగా ఇండియా vs ఇంగ్లాండ్‌ సినిమాలో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని