మహారాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం అసంతృప్తి

స్వరాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారిని గుర్తించడం రాష్ట్రాల బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది...

Published : 09 Jul 2020 12:45 IST

దిల్లీ: స్వరాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారిని గుర్తించడం రాష్ట్రాల బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం కేసును సుమోటోగా తీసుకుని విచారించింది. వలస కూలీల సమస్యల పరిష్కారానికి జాతీయ విధానం రూపొందించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. కరోనా నిర్వహణలో భాగంగా ఇప్పటికే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని సొలిసిటర్‌ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే మహరాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం సుప్రీంకోర్టు చేసింది.  మహరాష్ట్ర వలస కూలీల అంశంపై వారం రోజుల్లో సమగ్రంగా అఫిడవిట్ వేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  తదుపరి విచారణను జులై 17కి వాయిదా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని