COP26: విధ్వంసాన్ని జేమ్స్ బాండ్లా అడ్డుకుందాం: బ్రిటన్ ప్రధాని జాన్సన్
ఐరాస వాతావరణ సదస్సు (కాప్26)లో అత్యంత కీలక ఘట్టానికి తెరలేచింది. 120కిపైగా దేశాల ప్రభుత్వాధిపతులు, దేశాధ్యక్షులు పాల్గొంటున్న ‘ప్రపంచ నేతల సదస్సు’..
వినాశకర బలిపీఠంపై ప్రపంచం
గ్లాస్గో: ఐరాస వాతావరణ సదస్సు (కాప్26)లో అత్యంత కీలక ఘట్టానికి తెరలేచింది. 120కిపైగా దేశాల ప్రభుత్వాధిపతులు, దేశాధ్యక్షులు పాల్గొంటున్న ‘ప్రపంచ నేతల సదస్సు’ (డబ్ల్యూఎల్ఎస్) సోమవారం బ్రిటన్లోని గ్లాస్గో నగరంలో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా అనేకమంది నాయకులు పాలుపంచుకుంటున్నారు. ఈ సదస్సును బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవడానికి సమయం మించిపోతోందన్నారు. ఆ దిశగా ఈ భేటీ.. జేమ్స్ బాండ్ తరహా పరిస్థితిని ఎదుర్కొంటోందంటూ సినిమాల్లో ప్రపంచాన్ని అంతం చేయాలనుకునే వ్యక్తులతో ఆ సీక్రెట్ ఏజెంటు సాగించే పోరాటాలను ప్రస్తావించారు. నేడు వినాశకర బలిపీఠం(డూమ్స్డే డివైస్)పై ప్రపంచం మొత్తం ఉందన్నారు. దాన్ని నిర్వీర్యం చేయడం ఎలా అనేదానిపై అందరం తలమునకలై ఉన్నామని చెప్పారు. ‘‘జేమ్స్ బాండ్ తరహా పరిస్థితినే మనం ఎదుర్కొంటున్నాం. విషాదమేంటంటే ఇది సినిమా కాదు. ప్రపంచాన్ని నాశనం చేసే యంత్రమూ ఊహాజనితం కాదు.. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులే ఇక్కడ ముప్పు. 250 ఏళ్ల క్రితం గ్లాస్గోలో జేమ్స్ వాట్.. ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. అది బొగ్గును మండించటం ద్వారా నడుస్తుంది. దానిని మనం ‘డూమ్స్ డే యంత్రం’ స్థాయికి తీసుకొచ్చాం’’ అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతమున్న ప్రపంచ ఉష్ణోగ్రతలకు అదనంగా 2 డిగ్రీల సెల్సియస్ చేరితే ఆహార సరఫరాకు విఘాతం కలుగుతుందని జాన్సన్ హెచ్చరించారు. ‘‘అదే 3 డిగ్రీల సెల్సియస్ పెరిగితే మరిన్ని కార్చిచ్చులు, తుపాన్లు ఉత్పన్నమవుతాయి. 4 డిగ్రీలకు చేరితే ప్రపంచవ్యాప్తంగా నగరాలకు నీళ్లొదులుకోవాల్సిందే. భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయకుంటే ఈ విపరిణామాలు తప్పవు. అమెరికాలోని మయామీ, చైనాలోని షాంఘై నగరాలు సముద్రం పాలవుతాయి. మనం దిద్దుబాటు చర్యల్లో ఎంత జాప్యం చేస్తే.. నష్టం అంత తీవ్రంగా ఉంటుంది. వాతావరణ మార్పులకు సంబంధించిన ‘గడియారం’ విషయంలో మానవాళి ఇప్పటికే చాలా జాప్యం చేసింది’’ అని పేర్కొన్నారు.
హామీలు ‘బ్లా.. బ్లా..’ కాకూడదు
భూతాపం కట్టడి విషయంలో రాజకీయ నేతలు చేసిన డొల్ల హామీలను ఎద్దేవా చేస్తూ పర్యావరణ ఉద్యమకారణి గ్రెటా థన్బర్గ్ ఇటీవల చేసిన ‘బ్లా.. బ్లా.. బ్లా..’ వ్యాఖ్యలను జాన్సన్ ప్రస్తావించారు. ప్రపంచ నేతలు తమ హామీలను నిలబెట్టుకోకుంటే అవన్నీ డొల్లగానే మిగిలిపోతాయని ఆయన హెచ్చరించారు. ‘‘మన పనితీరును భవిష్యత్ తరం విశ్లేషిస్తుంది. మనం విఫలమైతే వారు క్షమించరు. చరిత్రాత్మక మలుపునకు గ్లాస్గో సదస్సులో ఒక అవకాశం వచ్చినప్పటికీ.. అలాంటి మలుపు చోటుచేసుకోలేదని వారు గుర్తిస్తారు’’ అని తెలిపారు.
పశ్చిమ దేశాలకు బాధ్యత
వాతావరణ మార్పుల విషయంలో పశ్చిమ దేశాలకు ఎక్కువ బాధ్యత ఉందని జాన్సన్ పేర్కొన్నారు. ‘‘200 ఏళ్లుగా పారిశ్రామిక దేశాలు తమ ద్వారా ఉత్పన్నమవుతున్న సమస్యలను పెడచెవిన పెట్టాయి. పారిస్లో ఇచ్చిన మాట ప్రకారం పేద దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్లు సాయం చేసేందుకు మనం కృషి చేయాలి. అయితే 2023లోగా అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడంలేదు’’ అని తెలిపారు. ఇప్పుడు ప్రపంచానికి హరిత పారిశ్రామిక విప్లవం అవసరమన్నారు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కూడా ఈ సదస్సులో ప్రసంగించారు. వాతావరణ సంక్షోభానికి వినూత్న పరిష్కారాలను కనుగొనాలని ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో నేతలు.. 2015లో పారిస్లో కుదిరిన ఒప్పందంలో అంగీకరించిన లక్ష్యాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు, కర్బన ఉద్గారాల తగ్గింపునకు తమ హామీలను ప్రకటించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం