Covid Vaccine: టీకా స్వచ్ఛందం కాదు.. నిర్బంధం!
దేశంలో వయోజనులంతా కొవిడ్ టీకా తీసుకోవాలని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయంలో నిర్బంధమేమీ, అంతా స్వచ్ఛందమేనని స్పష్టంచేస్తోంది.
తప్పనిసరి చేస్తున్న స్థానిక సంస్థలు, కంపెనీలు
లోకల్ సర్కిల్స్ సర్వేలో 26% మంది వెల్లడి
దిల్లీ: దేశంలో వయోజనులంతా కొవిడ్ టీకా తీసుకోవాలని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయంలో నిర్బంధమేమీ, అంతా స్వచ్ఛందమేనని స్పష్టంచేస్తోంది. ఇదే విషయాన్ని అక్టోబరు 8న బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లోనూ పేర్కొంది. అయితే దేశవ్యాప్తంగా పలు స్థానిక సంస్థలు, సంఘాలు, కంపెనీలు మాత్రం తమ పరిధిలోని వారంతా టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. ‘లోకల్ సర్కిల్స్’ తాజా సర్వేలో.. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు ఇదే విషయం చెప్పారు. సర్వే కోసం 328 జిల్లాల్లో 36 వేల మంది అభిప్రాయాలను సేకరించగా.. 26% మంది తమ స్థానిక ప్రభుత్వాలు టీకాను తప్పనిసరి చేశాయని వెల్లడించారు. 29% మంది తమ కాలనీ/మార్కెట్/సొసైటీలలో అందరికీ టీకా తప్పనిసరి చేశారని, ధ్రువీకరణ పత్రం కూడా చూపమంటున్నారని చెప్పారు. కంపెనీలు, ఉద్యోగుల యాజమాన్యాలు కూడా ఇదే వైఖరితో ఉన్నట్టు 40% మంది తెలిపారు. మరో 13% మంది మాత్రం తమ యాజమాన్యాలు టీకా తప్పక వేసుకోవాలని చెబుతున్నా బలవంతం చేయడం లేదన్నారు. అలాగే కొన్నిచోట్ల స్థానిక పరిపాలనాధికారులు.. టీకా వేసుకోని పౌరులకు కొన్ని ప్రయోజనాలను ఆపేస్తున్నట్టు కూడా సర్వేలో తేలింది. ఉదాహరణకు.. ఔరంగాబాద్ జిల్లాలో ఒక్క డోసు టీకా కూడా తీసుకోనివారికి రేషన్ దుకాణాలు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ పంపుల్లో సేవలు బంద్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ సైతం.. టీకా వేసుకోని ఉద్యోగులు, అధికారులు జీతాలు ఆపేస్తామని ఏకంగా ఉత్తర్వులిచ్చింది. టీకా విషయంలో ప్రజల్ని చైతన్యపరచాలే తప్ప ఎలాంటి బలవంతం చేయకూడదన్న కేంద్రం వైఖరిపైనా తమకు అవగాహన ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకుంటేనే బస్సులోకి అనుమతి ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ తాజా నిర్ణయం
ఠాణె: కరోనా వ్యాక్సిన్ వేయించుకోని తమ సిబ్బందికి జీతాలు చెల్లించేది లేదని ఉత్తర్వులు జారీ చేసిన మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ) తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని ప్రజలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. నవంబరు చివరి నాటికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘‘కార్పొరేషన్ పరిధిలో వ్యాక్సిన్ తీసుకోని వారు కనిపిస్తే వెంటనే సమీప కేంద్రంలో వారికి టీకాలు వేయిస్తాం. టీకాలు తీసుకున్న వారు బస్సుల్లో ప్రయాణించాలంటే తమ వెంట వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకువెళ్లాలి. లేదంటే వారిని బస్సులోకి అనుమతించబోం’’ అని టీఎంసీ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్