Cyber Attack: కొవిడ్ వేళ కోకొల్లలుగా సైబర్ దాడులు
కొవిడ్ మహమ్మారి విజృంభణ వేళ ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2021లో ఈ సైబర్ నేరాలు
గత ఏడాది 151% పెరుగుదల నమోదైందన్న డబ్ల్యూఈఎఫ్
దావోస్, దిల్లీ: కొవిడ్ మహమ్మారి విజృంభణ వేళ ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2021లో ఈ సైబర్ నేరాలు, రాన్సమ్వేర్ దాడుల సంఖ్య రికార్డు స్థాయిలో 151 శాతం పెరిగింది. ‘అంతర్జాతీయ సైబర్ భద్రత రూపురేఖలు- 2022’ పేరుతో దావోస్ ఎజెండా సదస్సులో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పలు కీలక అంశాలను బయటపెట్టింది.
*కొవిడ్ కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటలీకరణం చెందింది. అయితే అదే సమయంలో సైబర్ నేరాలూ పెరిగాయి.
* సైబర్ దాడులను గుర్తించి, వాటిపై స్పందించేందుకు ఒక్కో కంపెనీకి సగటున 280 రోజుల సమయం పడుతోంది.
*రాన్సమ్వేర్లు ప్రజా భద్రతకు ప్రమాదకరమన్నది దాదాపు 80% సైబర్ నిపుణుల అభిప్రాయం.
*గత ఏడాది సైబర్ దాడి కారణంగా ఒక్కో పెద్ద కంపెనీకి సగటున రూ.27 కోట్ల నష్టం వాటిల్లింది.
* సైబర్ దాడికి గురయ్యాక ఆరు నెలల వరకూ ఒక్కో కంపెనీ షేర్ ధర దాదాపు 3% తగ్గింది.
ప్రభుత్వాలపై సన్నగిల్లిన విశ్వాసం
దావోస్, దిల్లీ: కొవిడ్ ఉద్ధృతి వేళ గత ఏడాది కాలంలో అంతర్జాతీయంగా ప్రభుత్వాలు, మీడియాపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని ఓ సర్వే తేల్చింది. అదే సమయంలో బూటకపు వార్తల పట్ల ఆందోళనలు మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరాయని వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) దావోస్ ఎజెండా సదస్సులో విడుదలైన ‘ఎడెల్మన్ ట్రస్ట్ బారోమీటర్’ నివేదికతో ఈ మేరకు పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
* తప్పుడు సమాచారం, బూటకపు వార్తలను ఇతరులు తమ ఆయుధాలుగా ఉపయోగించుకునే ముప్పుందని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్నవారిలో 76% మంది ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో 82% మంది ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్, జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీల్లో ప్రజలు బూటకపు వార్తలపై పెద్దగా ఆందోళన వెలిబుచ్చలేదు.
* స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు, మీడియాపై ప్రజల్లో సగటు విశ్వాస శాతం పరంగా చూస్తే.. ఆ జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. రష్యా అట్టడుగున ఉంది.
* ఆర్థిక ఆశావాదం విషయంలో భారత్ టాప్-5లో చోటుదక్కించుకుంది.
* భారత్లో వ్యాపారాలు, ప్రభుత్వం, మీడియాపై విశ్వాసం తగ్గగా.. స్వచ్ఛంద సంస్థల విషయంలో అది స్థిరంగా ఉంది.
* మొత్తం 28 దేశాల్లో సర్వే నిర్వహించగా.. 23 దేశాల్లో ప్రజలు ప్రభుత్వాలతో పోలిస్తే వ్యాపారాల మీదే ఎక్కువ విశ్వాసం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య