డిజిటల్ వేదికగా ఎన్నికల సమరం..అయిదు రాష్ట్రాల్లో ‘వర్చువల్’ సందడి
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రచార శైలిని కొవిడ్ మార్చేస్తోంది.
ఫేస్బుక్, యూట్యూబ్, ట్విటర్లలో ప్రచార హోరు..
దిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రచార శైలిని కొవిడ్ మార్చేస్తోంది. ఒమిక్రాన్ ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 22 వరకు బహిరంగ సభలు, రోడ్ షోలు, ఊరేగింపులను నిషేధించింది. దీంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి డిజిటల్, ఆన్లైన్ వేదికలను, ప్రచార గీతాలను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విటర్లలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గేయ రచయితలు, కళాకారులు, సినీ నటులు ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్లో భాజపా ఎంపీలు, భోజ్ పురీ నటులైన రవి కిషన్, మనోజ్ తివారీల ప్రచార సందడి జోరందుకుంది. యూపీ ఎన్నికలకు శ్రీలంక హిట్ పాట బాణీలో భాజపా ప్రచార గీతం రూపొందింది. కాంగ్రెస్, సమాజ్ వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీలూ తమ తమ ప్రచార గీతాలను సంధించాయి. భాజపా హిందుత్వను, యోగి ఆదిత్యనాథ్ పాలనలో సాధించిన అభివృద్ధిని కీర్తించే గీతాలను ప్రచారంలో పెట్టగా, సమాజ్వాదీ పార్టీ సామ్యవాద సిద్ధాంతాలను శ్లాఘించే పాటలతో ముందుకెళుతోంది. కాంగ్రెస్ పార్టీ మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలో భాగస్వాములను చేస్తానంటూ ప్రచార గీతాలతో సందడి చేస్తోంది. యూపీలో మొత్తం 402 సీట్లకు పోటీచేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తానని హామీ ఇచ్చే గీతాలతో బరిలోకి దిగింది. ప్రతి నియోజకవర్గానికి 20 బృందాల చొప్పున ఏర్పాటు చేసి వాట్సప్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్ ల ద్వారా పార్టీ సందేశాలను ప్రచారంలో పెడుతోంది. పంజాబ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చన్నీని గంభీర ప్రకటనల మంత్రిగా చిత్రిస్తూ ఆప్ అనేక కొంటె చిత్రాలను (కార్టూన్లను) ప్రచారంలో పెట్టగా, ఆప్ నేత కేజ్రీవాల్ను ప్రచార కండూతి గల నేతగా చిత్రిస్తూ కాంగెస్ వ్యంగ్య చిత్రాలను విడుదల చేసింది.
ఉత్తరాఖండ్లో పింఛన్ అస్త్రం
సాయుధ దళాలకు ఒకే ర్యాంకు, ఒకే పింఛన్ విధానాన్ని వర్తింపజేయడంలో భాజపా విఫలమైందంటూ ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార వీడియోను విడుదల చేసింది. ఈ ప్రచారం అసత్యమంటూ భాజపా సొంత వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో పింఛన్ అందుకుని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్న మాజీ సైనికోద్యోగులను చిత్రించింది. గోవాలో తృణమూల్ కాంగ్రెస్ తమ పార్టీ చిహ్నమైన రెండు పుష్పాల గుర్తు చుట్టూ ప్రచార గీతాలను రూపొందించి ఊరూవాడా వినిపిస్తోంది.
వర్చువల్ ప్రచారానికి లెక్క చెప్పాల్సిందే
ఈ డిజిటల్, వర్చువల్ ప్రచార పర్వానికి అయిన ఖర్చు గురించి రాజకీయ పార్టీలు పూర్తి వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికోసం అభ్యర్థుల ఎన్నికల రిటర్నులలో ప్రత్యేక కాలమ్ను పొందుపరిచింది. గతంలో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు డిజిటల్ ప్రచార ఖర్చును కూడా రిటర్నులలో చూపినా, ఈ సారి దానికోసం ప్రత్యేకంగా ఒక కాలమ్ను ఏర్పాటు చేయడం విశేషం. నిర్దేశిత గడువులోగా తమ ఎన్నికల వ్యయాన్ని వెల్లడించని అభ్యర్థులను మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులుగా ప్రకటించే అధికారాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎన్నికల సంఘానికి ఇస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు