40 మంది భార్యలు.. ఒక్కడే భర్త.. రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లిన అధికారులకు షాక్‌!

దాదాపు 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్త పేరుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు.

Updated : 26 Apr 2023 22:37 IST

బిహార్‌: దాదాపు 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్త పేరుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు. బిహార్‌లో ప్రస్తుతం రెండో దశ కులగణన జరుగుతోంది. అందులో భాగంగా కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలు తెలుసుకునేందుకు.. ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి తిరుగుతున్నారు. అందులో భాగంగానే అర్వల్‌ జిల్లాలోని ఓ రెడ్‌లైట్‌ ఏరియాలో నివాసం ఉంటున్న వారి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లారు.

అక్కడ సుమారు 40 మంది మహిళలు.. తమ భర్త పేరు రూప్‌చంద్‌ అని చెప్పారు. చాలా మంది పిల్లలు సైతం తమ తండ్రి పేరు రూప్‌చంద్‌ అని తెలిపారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు. అనంతరం ఎందుకు అలా చెబుతున్నారని ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.. ఆ రెడ్‌లైట్‌ ఏరియాలో రూప్‌చంద్‌ అనే డ్యాన్సర్‌ ఉన్నాడు. అతడు చాలా ఏళ్లుగా పాటలు పాడుతూ.. డాన్స్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి అక్కడ సొంత నివాసం కూడా లేదు. అయినప్పటికీ.. అతడిపై అభిమానంతోనే మహిళలు రూప్‌చంద్‌ పేరును.. తమ భర్త పేరుగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉండేవారికి కులం అంటూ ఏదీ లేదని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని