గుల్జార్, రామభద్రాచార్యలకు జ్ఞానపీఠ్
ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యలు 2023 సంవత్సరానికి సంబంధించిన 58వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఉర్దూ కవి, సంస్కృత పండితునికి దక్కిన గౌరవం
దిల్లీ: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యలు 2023 సంవత్సరానికి సంబంధించిన 58వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. వారిని ఎంపిక చేసినట్లు శనివారం అవార్డు కమిటీ ప్రకటించింది. ‘రెండు భాషల్లో ప్రముఖ రచయితలైన ఇద్దరికి జ్ఞానపీఠ్ ఇవ్వాలని నిర్ణయించాం. సంస్కృత సాహితీవేత్త జగద్గురు రామభద్రాచార్య, ఉర్దూ కవి గుల్జార్లను ఈ అవార్డుకు ఎంపిక చేశాం’ అని కమిటీ వివరించింది. 1944లో ఏర్పాటైన జ్ఞానపీఠ్ అవార్డును భారతీయ సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఏటా ఇస్తుంటారు. సంస్కృత భాషకు ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి. ఉర్దూకు ఐదోసారి ఈ అవార్డు దక్కింది. అవార్డు కింద రూ.21 లక్షల నగదు, వాగ్దేవి విగ్రహం, ప్రశంసపత్రం అందజేస్తారు. జ్ఞానపీఠ్ అవార్డు ఎంపిక కమిటీ ఛైర్మన్గా ప్రతిభా రాయ్, సభ్యుల్లో తెలుగు జర్నలిస్టు ఎ.కృష్ణారావు ఉన్నారు. 2022లో ఈ అవార్డును గోవా రచయిత దామోదర్ మౌజో దక్కించుకున్నారు.
కవిత్వంలో దిట్ట
గుల్జార్గా సుప్రసిద్ధుడైన సంపూరన్ సింగ్ కల్రా (89) హిందీ సినీ సంగీత ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఉర్దూ కవిత్వంలోనూ ఆయన దిట్ట. గుల్జార్కు 2002లో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2004లో పద్మభూషణ్ అవార్డుతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. హిందీ చిత్రసీమలో చేసిన కృషికి గుర్తింపుగా 2013లో ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 5 జాతీయ చలనచిత్ర అవార్డులను ఆయన దక్కించుకున్నారు. స్లమ్డాగ్ మిలియనీర్లో ఆయన రాసిన ‘జై హో’ పాటకు 2009లో ఆస్కార్ అవార్డు వచ్చింది. 2010లో గ్రామీ అవార్డుకు ఆ పాట ఎంపికైంది. మాచిస్ (1996), ఓంకార (2006), దిల్ సే (1998), గురు (2007) చిత్రాల్లో ఆయన రాసిన పాటలకు ఎంతో పేరు ప్రఖ్యాతులొచ్చాయి. గుల్జార్ దర్శకుడిగానూ రాణించారు. కోషిష్ (1972), పరిచయ్ (1975), ఇజాజత్ (1977) చిత్రాలతోపాటు టీవీ సీరియల్ మీర్జా గాలిబ్కు (1988) ఆయన దర్శకత్వం వహించారు. సినీ ప్రయాణంతోపాటు సాహిత్యంలోనూ గుల్జార్ అనేక మైలురాళ్లను అధిగమించారు. కవితలనూ కొత్త పుంతలు తొక్కించారు. మూడు లైన్లతో పద్యాలను రచించి చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ చిన్న పిల్లల కవిత్వంపై ఆయన పని చేస్తున్నారు.
22 భాషల పండితుడు
రామభద్రాచార్య (74) చిత్రకూట్లోని తులసీ పీఠ్ వ్యవస్థాపకుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన హిందూ ఆధ్యాత్మిక గురువుగానూ గుర్తింపు పొందారు. విద్యావేత్త, రచయితగానూ సుప్రసిద్ధుడు. 240 వరకూ పుస్తకాలు, ఇతిహాసాలను రచించారు. ప్రస్తుతమున్న నలుగురు జగద్గురువులైన రామభద్రాచార్యల్లో ఆయన ఒకరు. 1982 నుంచి ఆయన ఈ హోదాలో ఉన్నారు. ఆయన 22 భాషల్లో పండితుడు. సంస్కృతం, హిందీ, అవధీ, మైథిలీ తదితర పలు భాషల్లో రచనలు చేశారు. 2015లో ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. రామభద్రాచార్య అసలు పేరు గిరిధర మిశ్ర. 2 నెలల వయసులో ఉన్నప్పుడు ఆయన ట్రకోమావల్ల కంటి చూపును కోల్పోయారు. దీంతో తాతవద్దే ఆయన ఓనమాలు దిద్దారు. ఐదేళ్ల వయసు వచ్చే నాటికే భగవద్గీత మొత్తాన్ని గుర్తు పెట్టుకోగలిగే స్థాయికి చేరుకున్నారు. 8ఏళ్ల వయసు నాటికి రామచరిత మానస్ మొత్తాన్ని నేర్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.