ఇక ఏటా పాఠ్యపుస్తకాల సవరణ

దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీచేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ)కి కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Published : 30 Apr 2024 04:48 IST

ఎన్‌సీఈఆర్‌టీకి కేంద్రం ఆదేశం

దిల్లీ: దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీచేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ)కి కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి, అప్‌డేట్‌ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. వార్షిక ప్రాతిపదికన పుస్తకాలను అప్‌డేట్‌ చేసే పద్ధతి ఏమీ లేదు. అయినప్పటికీ.. ఎన్‌సీఈఆర్‌టీ 2017 నుంచి కంటెంట్‌ను అప్పుడప్పుడూ సవరించడంతోపాటు, తాజాపరుస్తోంది. ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను క్రమంతప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించడం ఎంతో ముఖ్యమని భావించిన కేంద్రం.. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఏటా పుస్తకాలను సమీక్షించి, నవీకరించాలని ఎన్‌సీఈఆర్‌టీని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. న్యూ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేస్తుండగా.. 2026 విద్యా సంవత్సరం నాటికి అన్ని తరగతులకు ఈ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది మూడు, ఆరో తరగతులకు ఎన్‌సీఈఆర్‌టీ  కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని