శివుడికి నాలుక సమర్పించిన యువకుడు

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లా థానాడ్‌ గ్రామంలో బుధవారం రాజేశ్వర్‌ నిషాద్‌ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు.

Published : 09 May 2024 04:26 IST

దుర్గ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లా థానాడ్‌ గ్రామంలో బుధవారం రాజేశ్వర్‌ నిషాద్‌ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. అంజోరా పోలీస్‌స్టేషను పరిధిలో ఈ ఘటన జరిగింది. రాజేశ్వర్‌ భార్య మూగది. ఉదయాన్నే గ్రామంలోని కొలను వద్దకు చేరుకొని, కాసేపు మంత్రోచ్చారణ చేశాక తన నాలుక కోసుకొన్న రాజేశ్వర్‌ గట్టున ఉన్న రాయిపై దాన్ని ఉంచాడు. రక్తస్రావంతో ఆలయంలో ఉన్న అతణ్ని గుర్తించిన గ్రామస్థులు అంబులెన్సును పిలిచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. శివుణ్ని మనసులో ఏదో కోరిక కోరుకొన్న రాజేశ్వర్‌ నాలుక కోసుకున్నాడని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని