ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇస్త్రీ చేయని దుస్తులతో భూతాపంపై పోరు
ఐఐటీ ప్రొఫెసర్ వినూత్న ప్రతిపాదన
దిల్లీ: పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ‘రింకల్స్ అచ్చే హై’ (వాహ్ మండే) పేరుతో ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని, ముడతలు పడిన దుస్తులను ధరించాలని వారు నిర్ణయించారు. దీని ద్వారా ప్రస్తుతం 1.25 లక్షల కిలోల కర్బన ఉద్గారాలను అడ్డుకుంటున్నట్లు బాంబే ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకీ తెలిపారు. అయితే సోమవారం రోజున ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించవద్దని దేశవ్యాప్తంగా ఉన్న తమ ల్యాబ్ల్లోని సిబ్బందికి సూచిస్తూ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయం పేర్కొంది. ‘‘గత నెల 23న ధరిత్రీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ చేతన్ సోలంకీ సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయంలో ‘క్లైమేట్ క్లాక్’ను ఏర్పాటు చేశారు. అనంతరం చేసిన ప్రసంగంలో ఆయన ‘రింకల్స్ అచ్చే హై’ ఆలోచనను ప్రతిపాదించారు’’ అని తెలిపింది. ఇంధనాన్ని ఆదా చేస్తూ, పర్యావరణాన్ని రక్షించడం, వాతావరణ మార్పులపై అవగాహనను పెంచడం ‘రింకల్స్ అచ్చే హై’ కార్యక్రమ ఉద్దేశం. ‘‘వాతావరణ మార్పులపై పోరులో అత్యంత సులువైన పరిష్కార మార్గం.. ‘ఏదో ఒక పనికి స్వస్తి పలకడమే.’ రింకల్స్ అచ్చే హై కార్యక్రమం ఊపందుకుంటోంది. దీనికింద ప్రతి సోమవారం.. ఇస్త్రీ చేయని దుస్తులు ధరించాలని ప్రజలను కోరుతున్నాం. ఒక జత దుస్తులను ఇస్త్రీ చేయకపోవడం ద్వారా 200 గ్రాముల కర్బన ఉద్గారాలను అడ్డుకోవచ్చు. లక్షల మంది దీన్ని అనుసరిస్తే భారీగా కర్బన ఉద్గారాలకు కళ్లెం వేయవచ్చు. పైగా అది ఫ్యాషన్గా మారుతుంది. ప్రస్తుతం 6.25 లక్షల మంది ప్రతి సోమవారం ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. తద్వారా 1.25 లక్షల కిలోల ఉద్గారాలను అడ్డుకుంటున్నాం. ఈ ఏడాది చివరినాటికి కోటి మందికిపైగా ఈ ఉద్యమంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నా’’ అని సోలంకీ తెలిపారు. దేశవ్యాప్తంగా తమ ల్యాబ్లన్నింటిలో 10 శాతం మేర విద్యుత్ను పొదుపు చేయాలనుకుంటున్నట్లు సీఎస్ఐఆర్ అధికారి ఒకరు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.