Row over Bills: బిల్లులు వెనక్కి పంపిన గవర్నర్.. మళ్లీ తీర్మానానికి సిద్ధమైన స్టాలిన్ ప్రభుత్వం
అసెంబ్లీ తీర్మానించి పంపించిన అనేక బిల్లులను తమిళనాడు గవర్నర్ తిరిగి వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో మరోసారి వాటిని ఆమోదించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
చెన్నై: అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై భారత సర్వోన్నత న్యాయస్థానాన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమోదం కోసం వచ్చిన పలు బిల్లులను గవర్నర్ తిరిగి వెనక్కి పంపించారు. దీంతో వీటిపై మరోసారి తీర్మానం చేసి పంపించేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం నవంబర్ 18న అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనుంది.
‘అసెంబ్లీ తీర్మానించి పంపిన అనేక బిల్లులను గవర్నర్ తిరిగి పంపినట్లు తెలిసింది. వీటిపై మళ్లీ తీర్మానం చేసేందుకు శనివారం నాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది’ అని స్పీకర్ ఎం అప్పవూ వెల్లడించారు. తిరిగి పంపిన బిల్లులను వెంటనే ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోందని.. అందుకే ఈ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు గవర్నర్ వద్ద ఇటువంటివి 12 బిల్లులు పెండింగులో ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే, వీటిలో ఎన్ని బిల్లులను గవర్నర్ తిప్పి పంపారో అనే విషయంపై స్పష్టత లేదు. గత అక్టోబర్ నెలలో తమిళనాడు అసెంబ్లీ నిరవదిక వాయిదా పడింది.
గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి
ఇదిలాఉంటే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అటు పంజాబ్ ప్రభుత్వం కూడా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన సుప్రీం ధర్మాసనం.. గవర్నర్లు ఇలా వ్యవహరించడం ఆందోళనకరమైన అంశమని అభిప్రాయపడింది. 12 బిల్లుల పెండింగుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రతిస్పందన తెలపాలని నవంబర్ 10న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే గవర్నర్ ఆ బిల్లులను వెనక్కి పంపడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!