Jignesh Mevani: మహిళా పోలీసుపై దాడి కేసు.. జిగ్నేశ్ మేవానీకి బెయిల్
అస్సాంలో ఓ మహిళా పోలీసుపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి ఊరట లభించింది. ఈ కేసులో ఆయన అస్సాంలో బార్పేట్ స్థానిక కోర్టు బెయిల్ మంజూరు
గువాహటి: అస్సాంలో ఓ మహిళా పోలీసుపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి ఊరట లభించింది. ఈ కేసులో ఆయన అస్సాంలో బార్పేట్ స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సాయంత్రం జిగ్నేశ్ జైలు నుంచి విడుదల కానున్నారు.
కాగా.. ప్రధాని మోదీపై అనుచిత ట్వీట్ చేసిన కేసులో ఇటీవల జిగ్నేశ్ అస్సాంలో అరెస్టయి బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ జిగ్నేశ్ ఈ నెల 18న చేసిన ట్వీట్ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సే పేరును ప్రస్తావిస్తూ మోదీపై ఆయన చేసిన ట్వీట్పై కోక్రాఝర్ ప్రాంతంలో భాజపా నేత అరూప్ కుమార్ డే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఈ నెల 19న గుజరాత్లోని పాలన్పూర్లో జిగ్నేశ్ను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి తరలించారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన కోక్రాఝర్ కోర్టును ఆశ్రయించగా.. ఏప్రిల్ 25న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
అయితే బెయిల్పై విడుదలైన కొద్ది సేపటికే జిగ్నేశ్ను బార్పేట్ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఓ మహిళా పోలీసుపై దాడి చేశారని, అమర్యాదగా ప్రవర్తించారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై ఆయన కోర్టును ఆశ్రయించగా.. నేడు బెయిల్ మంజూరైంది.
తన అరెస్టుపై జిగ్నేశ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రధాని కార్యాలయం ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే తన అరెస్టు జరిగిందన్నారు. తన అరెస్టు భాజపా, ఆరెస్సెస్ కుట్రగా పేర్కొన్నారు. జిగ్నేశ్ గుజరాత్లోని వడగాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.