ఎంత పనున్నా పిల్లలతో హోమ్వర్క్ చేయిస్తా.. ఒక్కోసారి ఉదయం నాలుగయ్యేది!: ప్రియాంక
‘‘ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆలస్యంగా ఇంటికి చేరుతుంటా. అయినా, ఓ తల్లిగా పిల్లల చేత హోమ్వర్క్ చేయించడానికి మాత్రం సమయం కేటాయిస్తుంటా. ఒక్కోసారి ఉదయం 3-4 కూడా అవుతుంది. నా పిల్లలకే కాదు..‘ఆంటీ’ అంటూ వచ్చే వేరే వాళ్ల పిల్లలకు కూడా హోమ్వర్క్ విషయంలో సాయం చేస్తుంటా’’ అని ప్రియాంక వివరించారు.
దిల్లీ: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఈ విషయంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. పోలింగ్కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ గంటలు పార్టీ వ్యవహారాలు చూసుకోవాల్సిన పరిస్థితి. ఇంత బిజీ షెడ్యూల్లోనూ పిల్లల చేత హోమ్వర్క్ చేసే విషయంలో సాయపడతా అంటున్నారు ప్రియాంక గాంధీ వాద్రా. ఓ తల్లిగా ఒక్కోసారి ఉదయం 3-4 గంటల వరకు వారికి సాయపడుతుంటానని ఫేస్బుక్ వేదికగా నిర్వహించిన లైవ్ సెషన్లో చెప్పుకొచ్చారు.
‘మీ పిల్లల హోమ్వర్క్ విషయంలో మీరు సహాయపడుతుంటారా?’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ప్రియాంక ఈ విధంగా బదులిచ్చారు. ‘‘ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆలస్యంగా ఇంటికి చేరుతుంటా. అయినా, ఓ తల్లిగా పిల్లల చేత హోమ్వర్క్ చేయించడానికి మాత్రం సమయం కేటాయిస్తుంటా. ఒక్కోసారి ఉదయం 3-4 కూడా అవుతుంది. నా పిల్లలకే కాదు..‘ఆంటీ’ అంటూ వచ్చే వేరే వాళ్ల పిల్లలకు కూడా హోమ్వర్క్ విషయంలో సాయం చేస్తుంటా’’ అని ప్రియాంక వివరించారు. ప్రియాంకకు మిరయా వాద్రా (18), రిహాన్ వాద్రా (20) అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు.
అలాగే, చిన్నతనంలో కొన్ని సరదా సంఘటనలను కూడా ఫేస్బుక్ సెషన్లో గుర్తుచేసుకున్నారు ప్రియాంక. చిన్నతనంలో సోదరుడు రాహుల్ గాంధీ, తాను విపరీతంగా పోట్లాడుకునే వాళ్లమని చెప్పారు. అయితే ఎవరైనా తమ జోలికొస్తే మాత్రం ఒక్కటైపోయేవాళ్లమని తెలిపారు. నాన్నమ్మ ఇందిరాగాంధీ హత్యకు గురైన సమయంలో తాను, తన సోదరుడు చాలా రోజుల పాటు స్కూలుకు వెళ్లకుండా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చిందని చెప్పారు. చదువంతా ఇంట్లోనే సాగిందని, పరీక్షలు సైతం ఇంట్లోనే రాయాల్సి వచ్చిందని ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.